Monday, December 12, 2011

సహజ కవి '' మల్లెమాల '' ఇకా లేరు...

ప్రముఖ సాహితీవేత్త, ప్రముఖ సినీనిర్మాత... మల్లెమాల గారు ఇకా లేరు. సినిమా రంగంలో 'మల్లెమాల'గా సుపరిచితులైన  ఎమ్మెస్‌ రెడ్డి (87).  ఆయన పూర్తిపేరు మల్లె మాల సుందరరామిరెడ్డి
                సమాజంలోని అన్యాయాలను, దురాగతాలను చూపి చలించిపోయిన మానవతా మూర్తి. అద్భుతమైన పాటలను సినమాలకు, తెలుగు సాహితీ ప్రపంచానికి అందించారు. అదే సమయంలో సామాజిక స్ప ృహతో విప్లవ గీతాలు, కవితలు రచించారు.         
                 స్వాతంత్ర ఉద్యమ సమయంలో గాంధీజి ప్రసంగానికి ప్రభావితుడై, వారిని కలిసి ఆయన బాటలో అంటారాని తనాన్ని నిమ్ములించాలని అహర్నిశలు కృషి చేశారు. సమతా, మమతల బావనతో ఎన్నో కవితలను రచించారు. పశ్చిమబెంగాల్‌ కరువు వచ్చినపుడు 'కష్టజీవి' బుర్రకథని తోటివారితో కలిసి ప్రదర్శించి వచ్చిన డబ్బులను బెంగాల్‌ పంపినారు. ఎనో సినిమాలను రూపొందించారు. 'అంకుశం' సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో సహజ నటనతో కనిపించారు.            
          సహజ కవి, ఆంధ్రా వాల్మీకి, అభినవ వేమన...బిరుదులు, జాతీయ అవార్డులు, రాష్ట్ర అవార్డులు, ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.
                'మల్లెమాల' రాలిపోయింది. సుమధుర గీతం ఆగిపోయింది.

No comments:

Post a Comment