Friday, March 23, 2012

ఆయన పేరే యువతకు ఉత్తేజం...స్ఫూర్తి ...


 'షహీద్‌ భగత్‌సింగ్‌ పేరే యువతకు ఉత్తేజం. ఆయన స్ఫూర్తి
 పోరాట సంప్రదాయాలకో సంకేతం. 
త్యాగం ఆదర్శానికి నిదర్శనం.
 మూయించిన ఒక వీరుని కంఠం వేయిగొంతుకల విప్లవ శంఖం
              అన్న మహాకవి ఆవేదనను భగభగమండే అగ్నికణం లాంటి భగత్‌సింగ్‌ నిస్వార్థ పోరాట సంప్రదాయాలతో పోల్చడం సమంజసంగా ఉంటుంది. లాహోరు జైల్లో 1931 మార్చి 23న సంధ్యా సమయంలో స్వాతంత్య్రం కావాలి, ఇంక్విలాబ్‌ జిందాబాద్‌, విప్లవం వర్థిల్లాలిః, తెల్లదొరతనం పోవాలి, అన్నందుకు ప్రాణాలు కోల్పోయాడు. కోట్లాది భారతీయుల హృదయాల్లో ఆరని జ్యోతిగా చిరస్థాయిగా నిలిచిపోతాడని ఎవరు ఊహింలేదు.

                         1928 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు ఆర్థిక సంక్షోభం నీలినీడలు భారతదేశంపై కూడా పడ్డాయి. దేశమంతా పెద్ద పెద్ద పోరాటాలు, సమ్మెలు జరిగాయి. సరిగ్గా ఇదే సంవత్సరం సెప్టెంబర్‌లో ఢిల్లీలో అన్ని ప్రాంతాలకు చెందిన విప్లవకారులను సమావేశపరిచి, హిందూస్థాన్‌ సోషలిస్టు ప్రజాతంత్ర సంఘం అనే సంస్థను ఏర్పరిచారు భగత్‌సింగ్‌.  సోషలిజమే పార్టీ లక్ష్యంగా నిర్ణయించారు. పరిస్థితులు త్వరితగతిన మార్పు చెందుతున్నాయి. సైమన్‌ కమిషన్‌ గోబ్యాక్‌ అనే నినాదాలు నిప్పురవ్వల్లా బ్రిటిష్‌ వారిని దహించి వేస్తున్నాయి. దాన్ని సహించలేని వారు పంజాబ్‌ సింహం లాలా లజపతిరాయ్‌ని బలి తీసుకున్నారు. కార్మిక వర్గం వర్థిల్లాలిః, సామ్రాజ్యవాదం నశించాలిః, సోషలిజం వర్థిల్లాలిః, విప్లవం వర్థిల్లాలిః, అంటూ వారు చేసిన నినాదాలతో పార్లమెంటు హాలంతా మారుమ్రోగిపోయింది. ఎవరినో ఒకర్ని చంపేందుకు బాంబులు ఉపయోగించ లేదు. కేవలం చెవిటివాడిగా నటిస్తున్న ప్రభుత్వానికి ప్రజాఘోష వినిపించేందుకు మాత్రమే ఆ చర్య చేపట్టాల్సి వచ్చిందని భగత్‌సింగ్‌ వివరణ ఇచ్చారు.

                 కోర్టులో విచారణ ప్రారంభమైంది. అందరూ ఊహించినట్లుగానే భగత్‌సింగ్‌తో పాటు రాజగురు, సుఖదేవ్‌లకు కూడా ఉరిశిక్షను విధించారు. కోర్టును తమ భావాల ప్రచారానికి వేదికగా ఉపయోగించుకోవాలనుకున్న భగత్‌ సహచరుల కోరిక నెరవేరింది. పరాయి ప్రభుత్వం తన రాక్షస కబంధ హస్తాలతో వజ్రాల్లాంటి ముగ్గురు విప్లవవీరుల్ని సజీవంగా సమాధి చేసేందుకు ముహూర్తం నిర్ణయించింది. 1931 మార్చి 23న లాహోర్‌ జైల్లో టైప్‌మిషన్లు అధికారుల ఆదేశాలను టకటకమంటూ కొడుతున్నాయి. లాహోర్‌ జైల్లో చీకట్లు అంతటా వ్యాపించాయి.  ఇక జీవితంలో భగత్‌సింగ్‌ను చూడబోముః అనే భావన తోటి విప్లవకారుల చేత కన్నీరు పెట్టించింది. భావావేశపరుడయ్యే సమయం ఇంకా రాలేదు శివవర్మ. నేను కొన్ని రోజుల్లోనే అన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతాను. కానీ మీరు దీర్ఘప్రయాణం చేయవలసి ఉంది. బాధ్యత అనే పెద్ద బరువును మోయవలసి వున్నప్పటికీ ఈ సుదీర్ఘ ప్రయాణంలో నీవు అలసిపోవనీ, ధైర్యం కోల్పోవనీ, ఓటమి స్వీకరించి చతికిలబడిపోవని నా గట్టి నమ్మకం, అంటూ స్నేహితుడికి సందేశం ఇచ్చాడు భగత్‌సింగ్‌. 
                 ఆ కర్తవ్య దిశగా నేటి విద్యార్ధి, యువత భగత్‌సింగ్‌ ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి కంకణబద్దులవటమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి.


          భారత స్వాతంత్య్ర సమరంలో భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ లు అమరులైనారు. ఆ యోధులకు వందనాలు.

         భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ ల 81వ వర్ధంతి ( మార్చి 23) సందర్భంగా... 

Friday, March 16, 2012

సెంచరీల " సెంచరీ వీరుడు" ...


                    ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన సెంచరీల సెంచరీ వీరుడు (100 సెంచరీలు) సాధించిన బ్యాట్స్ మెన్. 
                     ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు సచిన్  టెండుల్కర్. క్రికెట్ క్రీడకు భారతదేశం లో అత్యధిక జనాదరణకు కారకుడై, చిన్న పిల్లలు మొదలు ముసలివాళ్ళ మనసులను సైతం దోచుకున్న వర్తమాన క్రికెటర్ టెండుల్కర్. భారత క్రికెట్ లో మెరుపులు మెరిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆటగాడు సచిన్. భారత జట్టుకు ఆపద్భాందవుడిగా ఎన్నో విజయాలు అందజేసిన ఈ ముంబాయి కి చెందిన బ్యాట్స్‌మెన్ ను పొగడని వారు లేరనే చెప్పవచ్చు. లెక్కకు మించిన రికార్డులు అతని సొంతం. టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగులలో మొదటి స్థానం సంపాదించాడు. వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగుల రికార్డు అతనిదే. ఇక సెంచరీల విషయంలో అతనికి దరిదాపుల్లో ఎవరూ లేకపోవడం గమనార్హం. లిటిల్ మాస్టర్ లేదా మాస్టర్ బ్లాస్టర్.  1997-1998లో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పొంది ఈ అవార్డు స్వీకరించిన ఏకైక క్రికెట్ క్రీడాకారుడిగా నిల్చినాడు. ఇప్పటి వరకు క్రికెట్ క్రీడా జగత్తులోని అత్యంత ప్రముఖమైన క్రీడాకారులలో ఒకరు సచిన్ టెండుల్కర్.

వన్డే రికార్డులు
వన్డే క్రికెట్ లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (49 సెంచరీలు)
వన్డే క్రికెట్ లో అత్యధిక అర్థ సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (95 అర్థ సెంచరీలు)
అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్. (18412 పరుగులు) 
అత్యధిక వన్డే పోటీలకు ఆడిన క్రికెటర్. (462 వన్డేలు)
వన్డే క్రికెట్ లో అత్యధిక పర్యాయాలు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డు పొందిన క్రికెటర్. (62 సార్లు)
వన్డే క్రికెట్ లో అత్యధిక పర్యాయాలు మ్యాన్ ఆప్ ది సీరీస్ అవార్డు పొందిన క్రికెటర్. (14 సార్లు)


టెస్ట్ రికార్డులు
టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (51 సెంచరీలు)
టెస్ట్ క్రికెట్‌లోఅత్యధిక అర్థసెంచరీలు సాధించిన భారతీయ బ్యాట్స్ మెన్. (63అర్థ సెంచరీలు)
20 సంవత్సరాల వయస్సులోనే 5 టెస్ట్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్.
కెప్టెన్‌గా ఇన్నింగ్సులో అత్యధిక పరుగులు చేసిన భారతీయుడు. (217 పరుగులు)
అన్ని టెస్టు ఆడే దేశాలపై సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు

Saturday, March 10, 2012

మిస్టర్‌ డిపెండబుల్‌ క్రికెట్‌కు వీడ్కోలు ...


             మిస్టర్‌ డిపెండబుల్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. శుక్రవారం మీడియా సమావేశంలో ద్రవిడ్‌ ఈ విషయాన్ని ప్రకటించాడు. 1996లో అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టిన రాహుల్‌ ద్రవిడ్‌ 16 ఏళ్లపాటు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో ద్రవిడ్‌ భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టాడు. ది వాల్‌, మిస్టర్‌ డిపెండబుల్‌గా పేరొందిన ద్రవిడ్‌ భారత క్రికెట్‌కు అందించిన సేవలు వర్ణించలేనివి.
                   164 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ద్రవిడ్‌ 52.31 సగటుతో 13,288 పరుగులు సాధించాడు. ఇందులో 36 శతకాలు, 63 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో 210 క్యాచ్‌లను పట్టి అత్యధిక క్యాచ్‌లను పట్టిన క్రికెటర్‌గా తన పేరిట రికార్డును లిఖించుకున్నాడు. దీంతోపాటు 25 టెస్టుల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దీనిలో భారత్‌ 8 మ్యాచుల్లో విజయం సాధించగా, ఆరు మ్యాచుల్లో ఓటమి పాలైంది. మరో 11 మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి. వన్డేల్లో కూడా ద్రవిడ్‌ అద్భుతంగా రాణించాడు. మొత్తం 344 మ్యాచ్‌లు ఆడిన దివాల్‌ 39.16 సగటుతో 10,889 పరుగులు సాధించాడు. వీటిలో 12 శతకాలు, 83 అర్ధ సెంచరీలు ఉన్నాయి.  ద్రవిడ్‌ 196 క్యాచ్‌లను కూడా పట్టాడు. సమకాలిన క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఖ్యాతి గడించిన ద్రవిడ్‌ భారత్‌ క్రికెట్‌ అందించిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయి. ఉత్తమ టెక్నిక్‌తో భారత ఇన్నింగ్స్‌కు పెట్టని గోడగా నిలిచే ద్రావిడ్‌ను పెవిలియన్‌కు పంపడానికి ఉద్ధండ బౌలర్లు కూడా అష్టకష్టాలు పడాల్సి వచ్చేది.  క్లిష్ట సమయంలోనూ నిబ్బరంగా ఆడే సత్తా ఒక్క ద్రవిడ్‌కే ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. విదేశి గడ్డపై అద్భుత రికార్డు కలిగిన ద్రవిడ్‌ భారత్‌కు ఎన్నో చారిత్రక విజయాలు అందించాడు.కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో హైదరాబాదీ వివిఎస్. లక్ష్మణ్‌తో కలిసి నెలకొల్పిన రికార్డు భాగస్వామ్యం క్రికెట్‌ చరిత్రలోనే అత్యద్భుత ప్రదర్శనల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

           ప్రపంచ క్రికెట్‌లో ద్రవిడ్‌ అద్భుత ఆటగాడు. ఆటగాడిగా ద్రవిడ్‌ స్థానాన్ని భర్తీ చేయడం దాదాపు అసాధ్యము.  భారత్‌కు లభించిన ఆణిముత్యాల్లో ద్రవిడ్‌ ఒకడు. సుదీర్ఘ కెరీర్‌లో ద్రవిడ్‌ సాగించిన ప్రస్థానం, భారత జట్టుకు చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టిన ఘనత ద్రవిడ్‌కే దక్కుతుంది.

Thursday, March 8, 2012

ఆకాశంలో సగం ...


నేడు 102 వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

               మహిళా దినోత్సవాలెన్ని జరుపుకున్నా ఆకాశంలో సగ భాగంగా ఉన్న మహిళల స్థితిగతుల్లో ఆశించిన మార్పు రాలేదు. అసమానత, అణచివేత, దోపిడీ అంతంకాలేదు. గత రెండు దశాబ్దాలుగా పాలకులు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలు, పెంచిపోషిస్తున్న వినిమయ, వినోద సంస్కృతి మహిళలను కడగండ్లపాల్జేస్తున్నాయి. సామాజిక, ఆర్థిక పరంగా మహిళలపై దాడులకు ఆజ్యం పోస్తున్నాయి. ఈ విధంగా స్త్రీ అస్తిత్వానికే ఇవి సవాల్‌గా పరిణమించాయి. సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానం, మత ఛాందసవాదం సాగిస్తున్న ఈ ముప్పేట దాడికి ప్రతిఘటన కూడా పెరుగుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలు తమ అస్థిత్వం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. మహిళా దినోత్సవం నాడు దోపిడీ, అణచివేత, హింస, అసమానతల నుండి విముక్తి కోసం శ్రామిక మహిళలు పోరాడి రక్తతర్పణ చేసిన చారిత్రాత్మక రోజు అయిన ఈ మహిళా దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ ఉద్యమాలను మరింత ఉధృతం చేయాల్సిన అవసరముంది. మహిళ ఉద్యమాలకు దిక్చూచి. 

                చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే చట్టం పట్ల బోలెడు శ్రద్ధాసక్తులు ప్రదర్శిస్తూనే మోకాలడ్డుతున్నారందరూ. వామపక్షాలు మాత్రమే దీనికి మినహాయింపు. కేరళలో సిపిఎం ఆధ్వర్యంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థలో 50శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది. అలాగే చట్ట సభల్లో మహిళలరిజర్వేషన్ల బిల్లుకు వామపక్షాలు సంపూర్ణ మద్దతునిస్తున్నాయి. ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించినా సోనియా గాంధీ నాయకత్వంలోని యుపిఏ సర్కార్‌ 'ఏకాభిప్రాయం కోసం' అంటూ లోక్‌సభలో పెట్టకుండా వాయిదాలు వేస్తున్నది. 

           అంతర్జాతీయ మహిళా దినోత్సవం  ( మార్చి 8)