Tuesday, October 23, 2012

దసరా శుభాకాంక్షలు...


మీకు, మీ కుటుంబ సభ్యులకు,  శ్రేయాభిలాషులకు 
 దసరా శుభాకాంక్షలు...2012.

  శుభాభినందనలతో.....    వీరయ్య కే

Tuesday, October 9, 2012

ప్రపంచ యువత ఆయనే బొమ్మ రూపంలో తలచుకుంటుంది...


           యువత ధరిస్తున్న టీ షర్ట్స్‌పై ఎక్కువగా దర్శనమిస్తుంది ఒక బొమ్మ. మోటార్ వాహనాలు, సెల్‌ఫోన్స్, ఆఖరికి సినిమాల్లోనూ ఆ ప్రతి రూపాన్ని పెట్టటం కోసం యువత ఇష్టపడుతుంది. ఎక్కువ మంది యువతకు ఆ వ్యక్తి జీవితం తెలియకుండానే. ఆయన చనిపోయి 45 సంవత్సరాలు గడుస్తున్నా తెలిసో తెలియకో ఆ పేరు, ఆ రూపాన్ని ప్రపంచ యువత మరోరూపంలో తలచుకుంటుంది. ఆయనెవరో కాదు, నిత్య నూతన విప్లవ చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ఎర్నెస్టో చేగువేరా.

          1928, జూన్ 14న అర్జెంటీనాలోని రోసారియోలో  జన్మించారు.  వైద్య విద్యనభ్యసించి  చదువు పూర్తికాగానే అర్జెంటీనాలో 2,800 మైళ్ళు ప్రయాణం చేశాడు. తన మిత్రుడితో కలిసి ఒక పాత మోటార్‌సైకిల్‌పై లాటిన్ అమెరికా దేశాలన్నీ చుట్టొచ్చాడు. నియంతల పాలనలో మగ్గిపోతూ, పేదరికంతో అల్లాడిపోతున్న అభాగ్యుల జీవితాలను చే కళ్ళారా చూసి చలించిపోయాడు. లాటిన్ అమెరికా పేదల జీవితాల్లో కొత్త సూర్యోదయాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నాడు. దోపిడీ శక్తులను అంతమొందించాలంటే సమసమజాన్ని స్థాపించటం ఒక్కటే మార్గమని 'చే' భావించాడు.

           1955 జూలైలో ఇప్ప టి క్యూబా దేశాధినేత అప్పటి పోరాటయోధుడు ఫైడల్ కాస్ట్రోను కలుసుకున్నారు. ఆయనతో కలిసి క్యూబా విప్లవ పోరాటంలో చేరాడు. 1956 నవంబర్25 నుంచి, డిసెంబర్ 2 వరకు 'గ్రాన్‌మా' నౌకలో 82 మందితో బయలుదేరిన విప్లవ తిరుగుబాటు యాత్రలో కాస్ట్రోతో కలిసి క్యూబా విప్ల వం విజయవంతం కావటంలో కీలకపాత్ర వహించాడు. నిరంతర విప్లవకారుడైన 'చే', క్యూబాలో విజయం లభిస్తే తాను మరో లాటిన్ అమెరికా దేశంలో విప్లవం నిర్మించటానికి వెళతానని అలా అయితేనే నీతో కలిసి వస్తానని, 1955 లో కాస్ట్రో నుంచి మాట తీసుకున్నాడు. ఆ మాట ప్రకారం లాటిన్ అమెరికాపై ఎర్ర బావుటా ఎగరేసేందుకు క్యూబాలో అధికారాన్ని త్యజించి విప్లవ బాట పట్టాడు.


Saturday, September 29, 2012

మన గుండె. మన చేతుల్లో...


గుండె లబ్-డబ్ అనేది మన జీవన నాదం.
గుప్పెడంత గుండె మన ప్రాణానికి మూలం. 
అది నిర్విరామంగా కొట్టుకుంటేనే మనకు జీవితం.
మానసిక, శారీరక సమస్యలకు గుండె ఆరోగ్యానికి  సంబందం ఉంది. 
మన అనందమయ జీవితానికి  గండె  ఆరోగ్యం  ఎంతో ముఖ్యం.    

మన జీవన విధానం లో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా దానిని అదుపులో పెట్టవచ్చు.

1. పొగ త్రాగటం మానండి. పొగాకు వాడే ఉత్పత్తులను వాడకండి.
2. ఆల్కహాల్ సేవించడం మానండి.
3. ప్రతి రోజు తప్పనిసరిగా 30 నిముషాలు వ్యాయామము(నడక, పరుగు...) చేయడం అలవాటు చేసుకోండి.
4. మధుమేహం, బరువు,  రక్తపోటు ఆదుపులో  ఉండేలా చూసుకోండి. 
5. ఎక్కువ  కొలెస్ర్ట్రలు ఉండే  ఆహారాన్ని మానేయలి.

(   నేడు వరల్డ్ హార్ట్ డే ....)  

 మరిన్ని ..... డాక్టర్ గారిని కలిసి వారి సలహాలు సూచనలు పాటించండి.  



Thursday, September 27, 2012

పోరాట సంప్రదాయాలకో సంకేతం.యువతకు ఉత్తేజం. స్ఫూర్తి. ఆదర్శం ...


  
 షహీద్‌ భగత్‌సింగ్‌ పేరే యువతకు ఉత్తేజం. 
 ఆయన స్ఫూర్తి.
 పోరాట సంప్రదాయాలకో సంకేతం. 
 త్యాగం ఆదర్శానికి నిదర్శనం.

 ఇంక్విలాబ్‌ జిందాబాద్‌, విప్లవం వర్థిల్లాలిః, తెల్లదొరతనం పోవాలి, అన్నందుకు ప్రాణాలు కోల్పోయాడు. కోట్లాది భారతీయుల హృదయాల్లో ఆరని జ్యోతిగా చిరస్థాయిగా నిలిచిపోతాడని ఎవరు ఊహింలేదు.

 నాడు బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి అతి చిన్న వయస్సులో ఉరికంబాన్ని చిరునవ్వుతో ముద్దాడిన యువ కిశోరాన్ని స్మరించుకోవాల్సిన అవసరముంది. చిల్లర వర్తకంలోకి ఎఫ్‌డిఐలను అనుమతించడం, దేశంలో విద్య వ్యాపారీకరణకు విదేశీ వర్శిటీలను స్వాగతించడం చూస్తుంటే... కేంద్ర, రాష్ట్ర పాలకులు సామ్రాజ్యవాదులకు దాసోహమైనట్లు తేటతెల్లమవుతోంది. కావున విద్యార్థులు, యువకులు భగత్‌సింగ్‌ను స్మరించుకుంటూ సామ్రాజ్యవాద, నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామని నేడు భగత్‌సింగ్‌ 105వ జయంతి సందర్బంగా  ప్రతిజ్ఞ పూనాలని విజ్ఞప్తి. 


Wednesday, August 15, 2012

ఎందరో వీరుల త్యాగఫలం...


ఎందరో వీరుల త్యాగఫలం.....
ఆగస్టు 15 మన దేశ చరిత్రలో మరచిపోలేని  రోజు.
స్వాతంత్ర్యం  సాదించడానికి కృషిచేసిన త్యాగమూర్తులను గుర్తుచేసుకుందాం...


స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

Saturday, August 4, 2012

హైదరాబాద్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు క్యాంస్యం




  ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో హైదరాబాద్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు క్యాంస్యం లభించింది. మూడో స్థానంకోసం జరిగిన పోటీలో చైనా క్రీడాకారిణి వాంగ్‌పై సైనా విజయం సాధించింది.

భాగ్యనగరానికి మరో కీర్తి...
  హైదరాబాద్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు శుభాకాంక్షలు.  మన క్రీడాకారులు మరిన్ని పతకాలు తేస్తారని అశిస్తూ...

Tuesday, July 31, 2012

భాగ్యనగరానికి మరో కీర్తి...


భాగ్యనగరానికి మరో కీర్తి...
లండన్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ బోణీ చేసినా హైదరాబాదీ షూటర్‌ గగన్‌ నారంగ్‌ కు శుభాకాంక్షలు.  మన క్రీడాకారులు మరిన్ని పతకాలు తేస్తారని అశిస్తూ...


( ఈనాడు సౌజన్యంతో..... )

Sunday, July 22, 2012

నేత్రదానం చేద్దాం...మరో జీవితంలో వెలుగులు నింపుద్దాం...



నేత్రదానం చేద్దాం...మరో జీవితంలో వెలుగులు నింపుద్దాం...

మనం కూడా ప్రయత్నం చేద్దాం.

Friday, June 22, 2012

వేడి వేడిగా చల్లచల్లగా...

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని విశాఖపట్టణం ,  సింహాచలం,  ఆరకు లోయ,  బొర్రా గుహలు,  తిరుపతి,  శ్రీకాళహస్తి,  తమిలనాడు రాష్ట్రం వెల్లుర్ పట్టణంలోని గొల్డెన్ టెంఫుల్ ... మే 28 నుండి జున్ 3 వరకు    ముడు స్నేహితుల కుటుంబలతో  వెల్లివచ్చాం.  విశాఖపట్టణంలొ, గొల్డెన్ టెంఫుల్ ల దారి లో  వేడిని  భారించలేకపోయాం.   తిరుమల, బొర్రా గుహలు  చాలా ఆసక్తికరముగా,  ఆహ్లాదకరముగా చల్లచల్లగా ఉంది.  పిల్లలు మరింత ఎక్కువగా బీచ్ లలో ఎంజయ్ చేశారు.  మా టూర్  వేడి వేడిగా చల్లచల్లగా  జరిగింది.
విశాఖపట్టణం లో చూడదగిన ప్రదేశాలు :


   1. సింహాచలం - శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం.  2. రామకృష్ణ బీచ్ - విశాఖ వాసులకు ఇది మొదటి బీచ్. చాలా సుందరమైనది. సముద్రపు కోత వలన, బీచ్ విశాలత తగ్గింది. కొద్దిగా  కాలుష్యంగా ఉంది. ఈ ప్రాంతంలో, దేశ నాయకుల విగ్రహాలు, ప్రాంతీయ నాయకుల విగ్రహాలు నెలకొల్పారు. ఈ తీరానికి దగ్గరలోనే జలాంతర్గామి ( కల్వారి ) మ్యూజియం (భారత దేశంలో ఇటువంటి మ్యూజియం మరెక్కడా లేదు ) ఉన్నాయి. 3. కైలాసగిరి- శంఖం, ఛక్రం, నామాలు రాతిపూట కైలాసగిరి కొండ మీదనుంచి రాత్రివేళ మెరుస్తూ కనిపిస్తాయి. శివ పార్వతుల విగ్రహాలు కనువిందు చేస్తాయి కొండమీద.  4. వైజాగ్ స్టీలు ప్లాంటు. చాలా  పెద్దది.  చూడటానికి కనిసం 8 గంటలు వాహనం ద్వార పడుతుంది.   5. రిషికొంద బీచ్ - నగరానికి 8కి.మీ దూరంలో వున్నది.  ఇక్కడి సముద్ర తీరం స్నానాలు చేయటానికి సురక్షితమైన చొటు.  6. భ్మిలీ బీచ్ - నగరానికి  28కి.మీ దూరంలో వున్నది.  తీరం స్నానాలు చేయటానికి సురక్షితమైన చొటు.  7. జగదాంబా సెంటరు - జగదాంబ సినీమా హాలు    8.విశాఖ నౌకాశ్రయము,  విశాఖపట్నం చేపలరేవు 9.ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఆంధ్ర విద్యా కళా పరిషత్)    10. రామనాయుడు స్టూడియో   సముద్ర తీరంలో కొండ మీద  వుంది.         
విశాఖపట్టణంలొ వేడిని  భారించలేకపోయాం. దానితో రెండు రొజులు బీచ్ లలో ఎంజయ్ చేశాం. పిల్లలు మరింత ఎక్కువగా బీచ్ లలో ఎంజయ్ చేశారు. 

అరకు  : ఆరకు లోయ సముద్రమట్టానికి సుమారు 900 మీటర్ల ఎత్తులో ఉన్నది. విశాఖపట్నానికి 115 కి.మి.ల దూరంలో ఉన్న అరకు ఆహ్లాదకరమైన వాతావరణములతో , కొండలతో లోయలతో ప్రజలను ఆకర్షిస్తోంది. సహజ సాందర్యము కలిగిన అరకు సంపన్న భౌగోళిక స్వరూపము కలిగి సజీవముగా నిలుస్తుంది.  విశాఖపట్నం నుండి రోడ్డు, రైలు మార్గాలు రెండూ ఉన్నాయి.  ఇరువైపులా దట్టమైన ఆడవులు ఉండే ఘాట్ రోడ్ , ఆసక్తికరముగా ఆహ్లాదకరముగా ఉంటుంది. అన్ని ప్రకృతి అందాలు చూడాలంటే వెళ్లేటప్పుడు రైలు,  వచ్చేటప్పుడు బస్ ప్రయాణం మంచిది. రైలు వైజాగ్ లొ ఉదయం 6.50 కిరండొల్ వెళ్లే పాసింజర్ ఎక్కాలి. అది అలా కొండలు , లోయలు, గుహలు దాటుకుంటూ సాగిపోతుంది. ప్రయాణం సుమారు 5 గంటలు వుంటుంది. ఆ అనుభూతి అనుభవించాలే గాని చెప్పలేము. ఫ్రయాణం లొ "సిమిలిగుడ" అనే స్టేషన్ వస్తుంది. అది భారతదేశంలొ అతి ఎత్తులొ వున్న బ్రాడ్గేజ్ స్టేషన్ అంటారు. ఇక వెళ్లే దారిలొ బొర్రా గుహలు వస్తాయి. అక్కడ దిగి బొర్రా గుహలు చూసుకొని అరుకు వెళ్ళవచ్చు. లేదంటే తిరుగు ప్రయాణం లో చూడవచ్చు. దారిలో అనంతగిరి కొండల లో కాఫీ తోటలు ఉన్నాయి. అరుకులొ వుండటానికి అన్ని తరగతుల వారికి సరిపడ లాడ్జీలు, గెస్ట్ హౌసులు,  ట్రైబల్ కాటేజీలు వుంటాయి .  

Thursday, June 14, 2012

యువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది...

నేటికీ ప్రపంచ యువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది...చే  రూపం.

నీ రూపం
నీ పోరాట పటిమ
ప్రపంచ యువతరానికి   నేటికీ ఆదర్శం.   
ప్రపంచంలో ఎకడచుసినా  నీ రూపం...

ఏ   కీ చైన్  చూసినా, టీ షార్ట్ చూసినా .....
మరో వైపు నీ రూపం శత్రువు గుండెల్లో నేటికీ దడపుట్టిస్తోంది...  

నువ్వందించిన స్ఫూర్తి
ఆచరణలో నీవు చూపిన తెగువ
నేటికీ యువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది...

             చే గెవారా   దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు.  రాజకీయ నాయకుడు. ఇతడు పెట్టుబడిదారీ వ్యవస్థ  వ్యతిరేకించాడు. క్యూబా ప్రభుత్వం లో కాస్ట్రో తరువాత అంతటి శక్తివంతుడైన నాయకుడు.
              అర్జెంటీనా లోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్ 14న ఒక మధ్య తరగతి కుటుంబంలో
చే జన్మించాడు. 1953 లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పొందాడు. ఆ తదుపరి మోటారు సైకిల్ పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన స్థితిగతులను గురించి తెలుసుకున్నాడు.  విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు
          
1950 వ దశకం చివరలో అప్పటి క్యూబా నియంత బాటిస్టా కు వ్యతిరేకంగా కాస్ట్రో ఆధ్వర్యంలో జరిగిన గెరిల్లా పోరాటం(1956-1959)లో ముఖ్య పాత్ర పోషించాడు. డాక్టర్ గా మరియు మిలిటరీ కమాండర్ గా సేవలందించాడు. ఈ సమయం లోనే ఇతను 'చే' గా పిలువబడ్డాడు. చే గెవారా  అసలు పేరు ఎర్నెస్టో గెవారా డి లా సెర్నా.  గెవారా ఎవరినైనా పలకరించే సమయంలో చే అనే అర్జెంటీనా శబ్దాన్ని ఎక్కువగా వాడుతుండటంతో క్యూబన్ విప్లవకారులందరూ అతన్ని 'చే' అని పిలువనారంభించారు.
                ఈ పోరాటం విజయవంతమై కాస్ట్రో 1959 జనవరిలో క్యూబా ప్రభుత్వాధికారాన్ని చేపట్టినపుడు  చే  పరిశ్రమల మంత్రిగా, క్యూబా జాతీయ బాంకు ప్రెసిడెంట్ గా పనిచేసాడు. క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించాడు. ఈ పర్యటనలలో భాగంగానే చే 1959 జూలై నెలలో భారతదేశం లో కూడా పర్యటించాడు. తృతీయ ప్రపంచ దేశాల మీద అమెరికా పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చే  క్యూబా సామ్యవాద దేశం గా మారటానికి దోహదపడ్డాడు.

             
 ప్రపంచంలో ఎక్కడ  అన్యాయం జరిగినా 
                          ఎదురించడానికి  సిద్దంగా ఉండు - చే  
 
(నేడు చేగువేరా  జయంతి)

Saturday, May 19, 2012

మహా మనిషి, ఆదర్శ జీవి...

ప్రపంచ చరిత్రలో చెరిగిపోని స్థానం సంపాదించుకున్న అతికొద్దిమంది మహా పురుషుల్లో పుచ్చలపల్లి సుందరయ్య ఒకరు.
               నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంబంలో 1913 మే 1 న జన్మించాడు అందరిలాగే పుట్టారు. సంపన్న కుటుంబంలో పెరిగారు. కాని శ్రామికనేతగా ఎదిగారు. భూస్వామ్య బంధనాలను తాను తెంచుకోవడమే గాక, సమాజాభివృద్ధికి ఆటంకంగా మారిన ఫ్యూడల్‌ వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించివేయడానికి నడుంకట్టారు. భూస్వామ్య వ్యవస్థను సమూలంగా నిర్మూలించడానికి మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఆయుధంగా మలచుకోవడమేగాక దాన్ని ఆచరణలోపెట్టి లక్షలసంఖ్యలో సామాన్య ప్రజానీకాన్ని కదనరంగంలోకి దించిన మహానేత.   దేశంలో బలమైన వామపక్ష శక్తిగా సిపియంను ఆయన తీర్చిదిద్దారు.  సిద్ధాంతాన్ని ఆచరణతో మేళవించిన పోరాటయోధుడు.  తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు . కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన ఆయన తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు.
             ఆయన పార్లమెంటు సభ్యులుగా ఉన్నంత కాలం మన దేశ పార్లమెంటు లో సైకిల్ స్టాండు ఉండేది. పార్లమెంటు సమావేశాలకు ఆయన సైకిల్ మీదే వెళ్ళేవారు. ఆయనతో పాటే ఆ స్టాండు కు కాలం చెల్లింది.  రాష్ట్ర విధానసభలోనూ అదే సైకిల్. ఆయన నిరాడంబర జీవితానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు.  పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలిగితే తన ప్రజాసేవకు ఆ బంధాలు, బాంధవ్యాలు అడ్డుతగులుతాయని పెళ్లికాగానే కుటుంబనియంత్రణ శస్త్రచికిత్స చేయించుకొన్నారు. తండ్రినుంచి లభించిన ఆస్తిని నిరుపేద ప్రజలకు పంచివేశారు. 1985 మే19న మద్రాసులోని అపోలో ఆస్పత్రిలో పుచ్చలపల్లి కన్నుమూశారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో ఆయన పేరుతో గ్రంథాలయం, ఆడిటోరియం, పార్కు ఏర్పాటయ్యాయి.
                                    కులవ్యవస్థను నిరసించిన ఆయన తన అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి లోని రెడ్డి అనే కులసూచికను తొలగించుకున్నాడు. "కామ్రేడ్ పి.ఎస్." అని ఈయనను పిలిచేవారు. మన దేశంలో పేదలు వర్గరీత్యానే గాక సామాజికంగా అణచివేయబడుతున్నారు.  ''వ్యవసాయకార్మికులు, పేదరైతుల మీద జరుగుతున్న దాడులు, సాంఘిక ఇబ్బందులు, అంటరానితనం, కుల, మత ఛాందసత్వాలకు వ్యతిరేకంగా ఈ సంఘాలు, ప్రజాతంత్ర వాదులంతా పోరాడాలి'' అని  ఆనాడే  సుందరయ్య గారూ   పిలుపునిచ్చారు.
                 సుందరయ్యగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. సుందరయ్య బతికున్నంతకాలం సామాజికన్యాయం కోసం , పేద ప్రజల కోసమే పోరాడారు. పాలకుల విధానాలపై తిరుగుబాటు చేశారు. సోషలిజమనే నూతన సమాజం కోసం అహరహం శ్రమించారు.

     సుందరయ్య,   
    నీలాంటి త్యాగజీవులెందరయ్యా  ,    
    శ్రమజీవులు నిన్నెపుడూ మరువరయ్యా...
( నేడు మహా మనిషి  సుందరయ్య గారి  27వ వర్థంతి  సందర్బంగా  )

Sunday, May 6, 2012

నవ్వడం నలభై విధాలగ్రేట్‌ ...

నవ్వడం ఒక యోగం...నవ్వించడం ఒక భోగం...నవ్వలేకపోవడం ఒక రోగం...అని జంధ్యాల చెప్పిన మాటలు ఎన్ని తరాలు మారినా నిత్యసత్యాలే. అవును మరి నవ్వు అనేది ప్రతిమనిషిజీవితంలో అంతటి ప్రాముఖ్యతను సంపాదించుకుంది. నవ్వు నాలుగు విధాలచేటు అనే నానుడి కాస్తా నవ్వడం నలభైవిధాలగ్రేట్‌ అన్నవిధంగా మారిందంటే అతిశయోక్తికాదు. అందుకే నవ రసా ల్లో హస్యా నికి ప్రాధాన్యత ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా లాఫింగ్‌ క్లబ్‌లు ఏర్పాటుచేయడమే కాకుండా ప్రతి సంవత్సరం మేనెల మొదటి ఆదివారాన్ని ప్రపంచ నవ్వుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు మన హాస్య ప్రియులు.

            నవ్వుల క్లబ్‌ ఉద్యమం ప్రస్తుతం 65దేశాల్లో విస్తరించింది. ఆరోగ్యం ,ఆనందం, విశ్వశాంతికోసం జాతి మతాలకు అతీతంగా అనేక నగరాల్లోనూ, రెండవశ్రేణి పట్టణాల్లో సైతం నవ్వుల క్లబ్‌లు ఏర్పాటుచేస్తూ వారానికి ఒక్కరోజైనా కలిసి నవ్వుల్ని పంచుకుంటున్నారు. చిన్నా పెద్దా , ధనిక పేద, ఆడమగ తేడాలేకుండా అంతా కలిసి నవ్వుల పండుగ చేసుకుంటూ ఆరోగ్యాన్ని పదికాలలపాటు నవ్వుల సాక్షిగా కాపాడుకుంటున్నారు. జాతిమతం, ప్రాంతం, దేశంతో సంబంధంలేకుండా ప్రతి మనిషికి అర్థమయ్యే భాష నవ్వు. మనకు తెలియకుండానే వచ్చే నవ్వు... మనం నవ్వాలన్నా ప్రయత్నించినా మనసారా నవ్వ డం లేదని ఇట్టే తెలిసిపోతుంది. ఒక మనిషి ఎంత సంతోషంగా ఉన్నాడో తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి రోజుకు ఎన్ని సార్లు మన సారా నవ్వుతున్నాడో తెలుసుకుంటే చాలు.
            శరీరంలో సహజరోగ నిరోధకాలైన హార్మోన్ల ఉత్పత్తి పెరిగి, ఆర్తరైటిస్‌, స్పాండు లైటిస్‌, మైగ్రిన్‌ వంటి వ్యాధులు దూరమవుతాయి. సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఎక్కువగా ఉన్న ఉద్యోగులు ఎక్కువ సామర్ధ్యంతో పనిచేస్తారని మరో అధ్యయనంలో స్పష్టమైంది.  హాయిగా నవ్వేలా చార్లీచాపీన్‌ సినిమా చూడండి. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం పువ్వల్లే... నవ్వుల్‌...నవ్వుల్‌...అని హామింగ్‌ చేస్తూ ...నవ్వుతూ బతకండి...
( అంధ్ర ప్రభ  సౌజన్యంతో..... )

Saturday, May 5, 2012

కార్మికుల సుదీర్ఘ పోరాట ఫలం...

సోషలిజం దిశగా తొలి అడుగు : ఛావెజ్‌ 
వెనిజులాలో కొత్త కార్మిక చట్టం

                అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్‌ సంతకం చేసిన నూతన సమగ్ర కార్మిక చట్టం వెనిజులాలో సోషలిజం దిశగా మార్పులో తొలి అడుగని ఆ దేశ ప్రభుత్వం అభివర్ణించింది. ఈ చారిత్రిక పత్రంపై సంతకాలు చేసిన సందర్భాన్ని జరుపుకునేందుకు మేడే రోజున వేలాది మంది రాజధాని వీధుల్లో ప్రదర్శన జరిపారు. 'దీర్ఘకాలిక ప్రతిఘటన, పోరాటం, ఇంకా చెప్పాలంటే ఇబ్బందుల క్రమం లేకుండా ప్రజలు, కార్మికులు ఎన్నడూ విజయం సాధించలేదు. ఇప్పుడు నేను సంతకం చేసే గౌరవాన్ని అందించిన ఈ చట్టం కూడా సుదీర్ఘ పోరాట క్రమం ఫలితమే' అని అధ్యక్షుడు ఛావెజ్‌ చెప్పారు. ఈ కొత్త చట్టం ప్రకారం పనిని వారంలో 40 గంటలకు తగ్గిస్తుంది. 1990ల నుంచి సాగిన నయా ఉదారవాద విధానాల దోపిడీ రూపంగా భావిస్తున్న దేశంలోని ప్రయివేటు సబ్‌ కాంట్రాక్టు లేబర్‌ను రద్దు చేస్తుంది. ప్రసవానంతర సెలవును 12 నుంచి 25 వారాలకు పెంచడం, బిడ్డ పుట్టిన అనంతరం రెండేళ్ళ పాటు డిస్మిస్‌ కాకుండా నూతన దంపతులను కాపాడటం ద్వారా పని ప్రదేశంలో జండర్‌ సమానత్వం దిశగా ఇది గొప్ప ముందడుగని మహిళా గ్రూపులు ఈ చట్టాన్ని ప్రశంసించాయి.
                 1997లో అప్పటి రఫాయెల్‌ కాల్డెరా ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, కార్పొరేట్‌ ప్రయోజనాల ఒత్తిడికి తలొగ్గి రద్దు చేసిన కొన్ని కార్మిక హక్కులను ఈ చట్టం తిరిగి కల్పిస్తుంది. ఈ చట్టాన్ని అనుసరించి కార్మికుడు చివరి నెలలో తీసుకున్న జీతాన్ని అతడు సేవలందించిన సంవత్సరాల సంఖ్యతో గుణించడం ద్వారా కార్మికుల రిటైర్మెంట్‌ బోనస్‌ను తిరిగి ప్రవేశపెట్టడంతో పాటు ఎవరైనా కార్మికుడ్ని యజమాని అక్రమంగా తొలగిస్తే బోనస్‌గా రెట్టింపు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. 12 నెలల్లో అమలు చేయాల్సి ఉన్న ఈ కొత్త చట్టాన్ని యజమానులు ఏ మేరకు అమలు చేస్తున్నారనే విషయాన్ని పర్యవేక్షించేందుకు ఒక ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు కార్మికులు రిటైరైన తరువాత తమ ప్రయోజనాలను ఒక ప్రయివేటు బ్యాంక్‌, ప్రభుత్వ బ్యాంక్‌ లేదా ప్రభుత్వ యాజమాన్యంలోని జాతీయ రిటైర్మెంట్‌ నిధి ద్వారా తమకు ఏది ఇష్టమైతే అందులో ప్రాసెస్‌ చేసుకునేందుకు అవకాశముంది. ఛావెజ్‌ ఈ సంవత్సరం ప్రారంభంలో నెలవారీ కనీస వేతనాన్ని 32.5 శాతం పెంచుతూ ప్రకటించారు. దాన్ని రెండు దశలుగా అమలు చేస్తున్నారు. మొదటి దశ మే 1 నుంచి 1,548 బొలివార్ల నుంచి 1,780 బొలివార్ల పెంపుదలతో అమలులోకి వచ్చింది. సెప్టెంబర్‌లో 2,047 బొలివార్లలో 15 శాతం పెంపుదల వస్తుంది. ఈ నూతన చట్టం సోషలిజపు అత్యున్నత దశ నిర్మాణానికి సాధనమని విదేశాంగ మంత్రి నికొలస్‌ మదురా పేర్కొన్నారు. నాల్గింట ఒక వంతు మంది నిరుద్యోగులుగా ఉన్న స్పెయిన్‌లోని కార్మిక వ్యతిరేక చట్టాలకు ఇది పూర్తిగా భిన్నమైందని అన్నారు. వెనిజులా శాసన నిర్మాతలు దాదాపు మూడేళ్ల నుంచి కార్మిక సంస్కరణలపై చర్చిస్తున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరిస్తానని ఛావెజ్‌ వాగ్దానం చేసిన గత నవంబర్‌ నుంచి అవి వేగం పుంజుకున్నాయి. 'దోపిడీతో కూడిన పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాల నుంచి ఎలాంటి దోపిడీ లేని సోషలిస్టు ఉత్పత్తి సంబంధాల దిశగా కదలాలనే మా ఆకాంక్షను పునరుద్ఘాటిస్తున్నాం' అని వెనిజులా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పెడ్రో యూస్సే చెప్పారు. ఈ చట్టానికి 80 శాతం మంది వెనిజులా ప్రజలు సానుకూలంగా ఉన్నట్లు అంతర్జాతీయ పోలింగ్‌ సంస్థ ఇంటర్నేషనల్‌ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌ వివరించింది. 
( ప్రజాశక్తి సౌజన్యంతో.....  )

Tuesday, May 1, 2012

ప్రపంచ చరిత్రలో మహా మనిషి ...


ప్రపంచ చరిత్రలో చెరిగిపోని స్థానం సంపాదించుకున్న అతికొద్దిమంది మహా పురుషుల్లో పుచ్చలపల్లి సుందరయ్య ఒకరు. అందరిలాగే పుట్టారు. సంపన్న కుటుంబంలో పెరిగారు. కాని శ్రామికనేతగా ఎదిగారు. భూస్వామ్య బంధనాలను తాను తెంచుకోవడమే గాక, సమాజాభివృద్ధికి ఆటంకంగా మారిన ఫ్యూడల్‌ వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించివేయడానికి నడుంకట్టారు. భూస్వామ్య వ్యవస్థను సమూలంగా నిర్మూలించడానికి మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఆయుధంగా మలచుకోవడమేగాక దాన్ని ఆచరణలోపెట్టి లక్షలసంఖ్యలో సామాన్య ప్రజానీకాన్ని కదనరంగంలోకి దించిన మహానేత.

                 చరిత్ర పుటలను ఒక్కసారి తిరగవేస్తే పిఎస్‌ను కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరిగా అందరూ గుర్తుంచుకుంటారు. 1936లో ఆయన పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు. అప్పుడు ఆయన వయసు 24 ఏళ్లు. అఖిల భారత స్థాయిలో సంఘటిత రూపాన్ని సంతరించుకున్న పార్టీకి ఇదే తొలి కేంద్ర కమిటీ. దక్షిణ భారతదేశంలో పార్టీ కార్యకలాపాలను నిర్వహించే బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఆ తరువాత సిపిఐ(ఎం) ఏర్పాటులో పిఎస్‌ ప్రధాన పాత్ర పోషించారు. 1964 సిపిఐ(ఎం) వ్యవస్థాపక మహాసభలో ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 12 సంవత్సరాలపాటు పిఎస్‌ ప్రధాన కార్యదర్శిగా పార్టీకి సేవలందించారు. ఆ రకంగా సిద్ధాంతాన్ని ఆచరణతో జోడించి దేశంలో బలమైన వామపక్ష శక్తిగా సిపియంను ఆయన తీర్చిదిద్దారు. దాని కోసం ఆహరహం తపించారు. సిద్ధాంతాన్ని ఆచరణతో మేళవించిన పోరాటయోధుడు.
                  మన దేశంలో పేదలు వర్గరీత్యానే గాక సామాజికంగా అణచివేయబడుతున్నారు. తన చిన్నతనంలోనే సుందరయ్య ఈవిషయాన్ని గ్రహించారు. ఊరుమ్మడి బావుల్లో దళితుల్ని నీరు తోడుకోనివ్వకపోవడం, అంటరానితనం, కూలీ వివక్ష, అగౌరవపర్చడం, ఆడవారితో నీచంగా మాట్లాడటం వంటి అనాగరిక పద్ధతుల్ని ఆయన ఈసడించుకున్నారు.  విద్యార్థిగా స్వగ్రామం అలగానిపాడులో సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు.  ''వ్యవసాయకార్మికులు, పేదరైతుల మీద జరుగుతున్న దాడులు, సాంఘిక ఇబ్బందులు, అంటరానితనం, కుల, మత ఛాందసత్వాలకు వ్యతిరేకంగా ఈ సంఘాలు, ప్రజాతంత్ర వాదులంతా పోరాడాలి'' అని పిలుపునిచ్చారు.
                 సుందరయ్యగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. సుందరయ్య బతికున్నంతకాలం సామాజికన్యాయం కోసం , పేద ప్రజల కోసమే పోరాడారు. పాలకుల విధానాలపై తిరుగుబాటు చేశారు. సోషలిజమనే నూతన సమాజం కోసం అహరహం శ్రమించారు. 
సుందరయ్య 
నీలాంటి త్యాగజీవు లెందరయ్యా        
శ్రమజీవులు నిన్నెపుడూ మరువరయ్యా...
( నేడు 
మహా మనిషి   జన్మదినం సందర్బంగా - 
2012 మే1 - ఇది పుచ్చలపల్లి సుందరయ్య శత జయంతి సంవత్సరం. ) 

Saturday, April 14, 2012

కార్టూన్‌ వేయడం నేరమా?




పశ్చిమబెంగాల్‌లోని తృణమూల్‌ సర్కార్‌ మరో అప్రజాస్వామిక చర్యకు పాల్పడింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర రైల్వే మంత్రి ముకుల్‌రారు, రైల్వే శాఖ మాజీ మంత్రి దినేష్‌ త్రివేదిపై వ్యంగ్య కార్టూన్‌ వేసిన జాదవ్‌పూర్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ అంబికేష్‌ మహాపాత్రపై సైబర్‌ నేరం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసింది. అంతకు ముందు ప్రొఫెసర్‌పై తృణమూల్‌ గూండాలు దాడి చేసి విచక్షణారహితంగా పిడిగుద్దులు కురిపించారు. తృణమూల్‌ గూండాలు దాడి చేసి వెళ్లగానే పోలీసులు ఆయన్ను అరెస్టు చేయడం గమనార్హం.
                 కార్టూన్‌ వేసి సామాజిక నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్లలో ఉంచిన ప్రొఫెసర్‌ను అరెస్టు చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి. స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను పంచుకునే హక్కు కూడా పౌరులకు లేదా. ప్రభుత్యాధినేతలకు వ్యతిరేకంగా ప్రతిదినం దినపత్రికల్లో వ్యంగ్య కార్టూన్లు వస్తున్న విషయాన్ని ఉదహరిస్తున్న నెటిజన్లు, ఈ అరెస్టుతో బెంగాల్‌ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శిస్తున్నారు. పలు అంశాలు, వ్యక్తులు, విధానాలు, తదితర ప్రతి అంశంపై తమ అభిప్రాయాలను వెల్లడించడం, చర్చించడం సామాజిక నెట్‌వర్కింగ్‌ సైట్లలో సర్వ సాధారణం. సృజనాత్మకత ఉన్న ఎంతో మంది సామాజిక వెబ్‌సైట్ల ద్వారా వ్యంగ్య కార్టూన్లు, పేరడీ గేయాలు, పాటలు, వీడియోలను ఉంచుతూ తమ ప్రతిభను ప్రదర్శించుకుంటున్నారు.
               ప్రధాని మన్మోహన్‌, కేంద్ర మంత్రులు, ఇతర దేశాల నేతలపై కూడా ఎన్నో వ్యంగ్య కార్టూన్‌లు మనకు వెబ్‌సైట్లలో కనిపిస్తూనే ఉంటాయి. అయితే అన్ని రకాల స్వేచ్ఛలనూ హరించి వేయడమే లక్ష్యంగా ఇటీవల కాలంలో నిర్ణయాలు తీసుకుంటున్న మమతా సర్కారుకు తమ సిఎంపై వ్యంగ్య కార్టూన్‌ వేయడం కోపం తెప్పించింది. అంతే, ఆఘమేఘాల మీద సైబర్‌ చట్టాల కింద కేసు నమోదు, అరెస్ట్‌ కూడా జరిగిపోయింది. మహిళలపై అత్యాచారాలు, హత్య కేసుల్లోనూ, ఇతర తీవ్ర సంఘటనల్లోనూ ప్రజల నుంచి డిమాండ్‌ వచ్చే వరకూ ఏనాడూ స్పందించని రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కేసు నమోదు నుంచి అరెస్ట్‌ వరకూ అన్ని కార్యక్రమాలూ ఒక్క రోజులోనే చేపట్టడం గమనార్హం.
              సినీ దర్శకుడు మృణాల్‌ సేన్‌, చిత్రకారుడు వసీం కపూర్‌, సాంస్కృతిక రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సర్కారు తీరును తప్పుపట్టారు. ప్రొఫెసర్‌పై సైబర్‌ నేరాలు మోపడం పూర్తి అన్యాయమని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. తమ ప్రొఫెసర్‌ అరెస్టుకు నిరసనగా జాదవ్‌పూర్‌ యూనివర్శిటీ విద్యార్థులు వర్శిటీ ప్రాంగణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ఫాసిస్టు ధోరణిని అవలంబిస్తోందని, చిన్నపాటి విమర్శను కూడా సహించలేక పోతోందని అందరు విమర్శించారు. 
 ( ప్రజాశక్తి సౌజన్యంతో.....  )

Tuesday, April 10, 2012

ప్రపంచ మానవాళిని ఉత్తేజపరుస్తూనే ఉన్న మానవతామూర్తి...


మూర్తీభవించిన మానవత్వమే లెనిన్‌!
మహామేధస్సు, సంపూర్ణ మానవతల సమ్మేళనమే లెనిన్‌! 

    అరుదైన ఆ మానవోత్తముడు 1870 ఏప్రిల్‌ 10న జన్మించారు. మానవాళికి న్యాయమార్గం చూపటానికా అన్నట్లు 1893లో న్యాయవాది అయ్యారు. న్యాయమైన సమసమాజ స్థాపనా లక్ష్యంతో 1895లో విప్లవవాది అయ్యారు. ఉద్యమ భాగస్వామి కృపస్కయను జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. 1917 అక్టోబరు 7న బోల్షివిక్‌ పార్టీ సారథ్యంలో 'యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్టు రిపబ్లిక్‌'కు అధ్యక్షులయ్యారు!

    1917 అక్టోబరు 25 రాత్రి ఒక అద్భుతమైన రాత్రి! అది కెరెన్‌స్కీ ప్రభుత్వం పతనమైన రాత్రి! రెండు దశాబ్దాలుగా పలు శిక్షలకు గురవుతూ, అజ్ఞాతవాసంలో మగ్గిన లెనిన్‌, అర్ధాంగితో సహా తన మిత్రుని ఇంట స్వేచ్ఛగా విశ్రాంతి తీసుకున్న రాత్రి! 'ఈ క్షణం నుండి, ఎట్టి నష్టపరిహారమూ చెల్లించకుండా, భూస్వాముల అస్తి రద్దు చేయబడింది'' అను సోషలిస్టు రిపబ్లిక్‌ తొలి డిక్రీని రూపొందించి, లెనిన్‌ చరిత్ర గతినే మార్చేసిన రాత్రి! సదరు డిక్రీని మళ్లీ,మళ్లీ చూసుకుంటూ, ''ఇక నుండి ఈ పొలం అనే ఆవు, రైతులు, వ్యవసాయ కూలీలు అనే తన లేగదూడలకు తాగినన్ని పాలు ఇస్తుంది! వాళ్లంతా తమ తల్లిపాలను తనివితీరా తాగుతారుగదా!'' అన్న భావనతో ఆ ఆనందాన్ని అమితానందంతో నిద్రపట్టని వారి మిత్రుడు కూడా అక్కడికొచ్చి వారినలా చూసి పరవశంలో గంతులేస్తుంటాడు. మానవులంతా సుఖంగా జీవించే మార్గాన్ని చూపగలిగినందుకు, ఆనంద కెరటాల తాకిడికి లెనిన్‌ ఉక్కిరిబిక్కిరియైన ఆ రాత్రి నిజంగా మహాద్భుతమైన రాత్రి!

     లెనిన్‌ మనసు, మాట, చేతల కెన్నడూ తేడా కనిపించలేదు. త్రికరణశుద్ధిగా సోషలిస్టు లక్ష్యానికి అంకితమయ్యారు. సమసమాజపు వెలుగు కోసం ఆత్మబలిదానం చేసుకున్నారు! జీవితాంతమూ మద్యం, పొగాకు ముట్టని ఆదర్శనేత! ఆరోగ్యం కోసం మెరుగైన ఆహారం, ప్రత్యేక వసతులు అవసరమని డాక్టర్లు, ఆత్మీయులు మొత్తుకుంటున్నా 'ప్రజలు హీనంగా బతుకుతున్న సమయంలో అంతకన్నా బాగా బతికే నైతిక హక్కు నాకు లేదు' అంటూ వాటిని తిరస్కరించారు లెనిన్‌! మానవతను గూర్చి ఆయనకు మించిన అవగాహన కలవారు లేరు! లెనిన్‌ విప్లవ సాహసానికి, విజయానికీ అదే ఆయువుపట్టు!


          లెనిన్‌ జీవితాంతం ప్రతి మనిషి పట్లా, అతని వృత్తి ఉద్యోగ, హోదాలతో నిమిత్తం లేకుండా అమితంగా శ్రద్ధ వహించారు! ఆయన దయార్ద్ర హృదయాన్ని, ప్రేమ ఆప్యాయతలను ఒక్కసారైనా చవిచూడని కామ్రేడ్‌గాని, గ్రామం గాని సోషలిస్టు రష్యాలో లేదంటే అతిశయోక్తి కాదు.  సమసమాజపు వెలుగు కోసం కొవ్వొత్తిలా ఆత్మార్పణ చేసుకుంటూ నాటి కరాళ కరువు, భయంకర అంతర్‌, బాహ్య యుద్ధాల బారి నుండి తమ సోషలిస్టు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు, నాడు రష్యన్లను ఉత్తేజపరచిన ఆ మహనీయ, మానవతామూర్తి లెనిన్‌, నేటికీ అట్టి సమసమాజం కోసం తపనతో శ్రమించేలా ప్రపంచ మానవాళిని ఉత్తేజపరుస్తూనే ఉన్నారు. అమరజీవి లెనిన్‌!

 ఏప్రిల్‌ 10న 142వ జయంతి సందర్భంగా   

Monday, April 2, 2012

సీపీఐ జాతీయ సారథ్య బాధ్యతలను చేపట్టిన తెలుగువారు


  సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. పాట్నాలో జరిగిన సీపీఐ (భారత కమ్యూనిస్టు పార్టీ)21వ జాతీయ మహాసభల్లో బర్థన్ స్థానంలో ఆయన్ని పార్టీ ప్రతినిధులు ఎన్నుకున్నారు. జాతీయ రాజకీయ చిత్రంపై మరోసారి ఓ తెలుగువారిని ఉన్నతమైన పదవి వరించింది. 24ఏళ్ళ తర్వాత సీపీఐ సారథ్య బాధ్యతలను చేపట్టిన తెలుగువారిగా సురవరం చరిత్ర సృష్టించారు.

    సుదీర్ఘ కమ్యూనిస్టు ఉద్యమ నేపథ్యం కలిగిన సురవరం మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందినవారు.  సమరశీల రాజకీయ కార్యకర్త, మేధావి, మంచి వక్త.  2008 మార్చి నుండి పార్టీ ఉపప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అప్పటికి ఆయన భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమితి కార్యదర్శిగా, జాతీయ సమితి కార్య వర్గ సభ్యులుగా వున్నారు.
            సురవరం నల్గొండ నుంచి 1998లో తిరిగి 2004 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికై ప్రతిభావంతుడైన పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు.


Friday, March 23, 2012

ఆయన పేరే యువతకు ఉత్తేజం...స్ఫూర్తి ...


 'షహీద్‌ భగత్‌సింగ్‌ పేరే యువతకు ఉత్తేజం. ఆయన స్ఫూర్తి
 పోరాట సంప్రదాయాలకో సంకేతం. 
త్యాగం ఆదర్శానికి నిదర్శనం.
 మూయించిన ఒక వీరుని కంఠం వేయిగొంతుకల విప్లవ శంఖం
              అన్న మహాకవి ఆవేదనను భగభగమండే అగ్నికణం లాంటి భగత్‌సింగ్‌ నిస్వార్థ పోరాట సంప్రదాయాలతో పోల్చడం సమంజసంగా ఉంటుంది. లాహోరు జైల్లో 1931 మార్చి 23న సంధ్యా సమయంలో స్వాతంత్య్రం కావాలి, ఇంక్విలాబ్‌ జిందాబాద్‌, విప్లవం వర్థిల్లాలిః, తెల్లదొరతనం పోవాలి, అన్నందుకు ప్రాణాలు కోల్పోయాడు. కోట్లాది భారతీయుల హృదయాల్లో ఆరని జ్యోతిగా చిరస్థాయిగా నిలిచిపోతాడని ఎవరు ఊహింలేదు.

                         1928 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు ఆర్థిక సంక్షోభం నీలినీడలు భారతదేశంపై కూడా పడ్డాయి. దేశమంతా పెద్ద పెద్ద పోరాటాలు, సమ్మెలు జరిగాయి. సరిగ్గా ఇదే సంవత్సరం సెప్టెంబర్‌లో ఢిల్లీలో అన్ని ప్రాంతాలకు చెందిన విప్లవకారులను సమావేశపరిచి, హిందూస్థాన్‌ సోషలిస్టు ప్రజాతంత్ర సంఘం అనే సంస్థను ఏర్పరిచారు భగత్‌సింగ్‌.  సోషలిజమే పార్టీ లక్ష్యంగా నిర్ణయించారు. పరిస్థితులు త్వరితగతిన మార్పు చెందుతున్నాయి. సైమన్‌ కమిషన్‌ గోబ్యాక్‌ అనే నినాదాలు నిప్పురవ్వల్లా బ్రిటిష్‌ వారిని దహించి వేస్తున్నాయి. దాన్ని సహించలేని వారు పంజాబ్‌ సింహం లాలా లజపతిరాయ్‌ని బలి తీసుకున్నారు. కార్మిక వర్గం వర్థిల్లాలిః, సామ్రాజ్యవాదం నశించాలిః, సోషలిజం వర్థిల్లాలిః, విప్లవం వర్థిల్లాలిః, అంటూ వారు చేసిన నినాదాలతో పార్లమెంటు హాలంతా మారుమ్రోగిపోయింది. ఎవరినో ఒకర్ని చంపేందుకు బాంబులు ఉపయోగించ లేదు. కేవలం చెవిటివాడిగా నటిస్తున్న ప్రభుత్వానికి ప్రజాఘోష వినిపించేందుకు మాత్రమే ఆ చర్య చేపట్టాల్సి వచ్చిందని భగత్‌సింగ్‌ వివరణ ఇచ్చారు.

                 కోర్టులో విచారణ ప్రారంభమైంది. అందరూ ఊహించినట్లుగానే భగత్‌సింగ్‌తో పాటు రాజగురు, సుఖదేవ్‌లకు కూడా ఉరిశిక్షను విధించారు. కోర్టును తమ భావాల ప్రచారానికి వేదికగా ఉపయోగించుకోవాలనుకున్న భగత్‌ సహచరుల కోరిక నెరవేరింది. పరాయి ప్రభుత్వం తన రాక్షస కబంధ హస్తాలతో వజ్రాల్లాంటి ముగ్గురు విప్లవవీరుల్ని సజీవంగా సమాధి చేసేందుకు ముహూర్తం నిర్ణయించింది. 1931 మార్చి 23న లాహోర్‌ జైల్లో టైప్‌మిషన్లు అధికారుల ఆదేశాలను టకటకమంటూ కొడుతున్నాయి. లాహోర్‌ జైల్లో చీకట్లు అంతటా వ్యాపించాయి.  ఇక జీవితంలో భగత్‌సింగ్‌ను చూడబోముః అనే భావన తోటి విప్లవకారుల చేత కన్నీరు పెట్టించింది. భావావేశపరుడయ్యే సమయం ఇంకా రాలేదు శివవర్మ. నేను కొన్ని రోజుల్లోనే అన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతాను. కానీ మీరు దీర్ఘప్రయాణం చేయవలసి ఉంది. బాధ్యత అనే పెద్ద బరువును మోయవలసి వున్నప్పటికీ ఈ సుదీర్ఘ ప్రయాణంలో నీవు అలసిపోవనీ, ధైర్యం కోల్పోవనీ, ఓటమి స్వీకరించి చతికిలబడిపోవని నా గట్టి నమ్మకం, అంటూ స్నేహితుడికి సందేశం ఇచ్చాడు భగత్‌సింగ్‌. 
                 ఆ కర్తవ్య దిశగా నేటి విద్యార్ధి, యువత భగత్‌సింగ్‌ ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి కంకణబద్దులవటమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి.


          భారత స్వాతంత్య్ర సమరంలో భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ లు అమరులైనారు. ఆ యోధులకు వందనాలు.

         భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ ల 81వ వర్ధంతి ( మార్చి 23) సందర్భంగా... 

Friday, March 16, 2012

సెంచరీల " సెంచరీ వీరుడు" ...


                    ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన సెంచరీల సెంచరీ వీరుడు (100 సెంచరీలు) సాధించిన బ్యాట్స్ మెన్. 
                     ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు సచిన్  టెండుల్కర్. క్రికెట్ క్రీడకు భారతదేశం లో అత్యధిక జనాదరణకు కారకుడై, చిన్న పిల్లలు మొదలు ముసలివాళ్ళ మనసులను సైతం దోచుకున్న వర్తమాన క్రికెటర్ టెండుల్కర్. భారత క్రికెట్ లో మెరుపులు మెరిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆటగాడు సచిన్. భారత జట్టుకు ఆపద్భాందవుడిగా ఎన్నో విజయాలు అందజేసిన ఈ ముంబాయి కి చెందిన బ్యాట్స్‌మెన్ ను పొగడని వారు లేరనే చెప్పవచ్చు. లెక్కకు మించిన రికార్డులు అతని సొంతం. టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగులలో మొదటి స్థానం సంపాదించాడు. వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగుల రికార్డు అతనిదే. ఇక సెంచరీల విషయంలో అతనికి దరిదాపుల్లో ఎవరూ లేకపోవడం గమనార్హం. లిటిల్ మాస్టర్ లేదా మాస్టర్ బ్లాస్టర్.  1997-1998లో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పొంది ఈ అవార్డు స్వీకరించిన ఏకైక క్రికెట్ క్రీడాకారుడిగా నిల్చినాడు. ఇప్పటి వరకు క్రికెట్ క్రీడా జగత్తులోని అత్యంత ప్రముఖమైన క్రీడాకారులలో ఒకరు సచిన్ టెండుల్కర్.

వన్డే రికార్డులు
వన్డే క్రికెట్ లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (49 సెంచరీలు)
వన్డే క్రికెట్ లో అత్యధిక అర్థ సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (95 అర్థ సెంచరీలు)
అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్. (18412 పరుగులు) 
అత్యధిక వన్డే పోటీలకు ఆడిన క్రికెటర్. (462 వన్డేలు)
వన్డే క్రికెట్ లో అత్యధిక పర్యాయాలు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డు పొందిన క్రికెటర్. (62 సార్లు)
వన్డే క్రికెట్ లో అత్యధిక పర్యాయాలు మ్యాన్ ఆప్ ది సీరీస్ అవార్డు పొందిన క్రికెటర్. (14 సార్లు)


టెస్ట్ రికార్డులు
టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (51 సెంచరీలు)
టెస్ట్ క్రికెట్‌లోఅత్యధిక అర్థసెంచరీలు సాధించిన భారతీయ బ్యాట్స్ మెన్. (63అర్థ సెంచరీలు)
20 సంవత్సరాల వయస్సులోనే 5 టెస్ట్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్.
కెప్టెన్‌గా ఇన్నింగ్సులో అత్యధిక పరుగులు చేసిన భారతీయుడు. (217 పరుగులు)
అన్ని టెస్టు ఆడే దేశాలపై సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు

Saturday, March 10, 2012

మిస్టర్‌ డిపెండబుల్‌ క్రికెట్‌కు వీడ్కోలు ...


             మిస్టర్‌ డిపెండబుల్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. శుక్రవారం మీడియా సమావేశంలో ద్రవిడ్‌ ఈ విషయాన్ని ప్రకటించాడు. 1996లో అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టిన రాహుల్‌ ద్రవిడ్‌ 16 ఏళ్లపాటు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో ద్రవిడ్‌ భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టాడు. ది వాల్‌, మిస్టర్‌ డిపెండబుల్‌గా పేరొందిన ద్రవిడ్‌ భారత క్రికెట్‌కు అందించిన సేవలు వర్ణించలేనివి.
                   164 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ద్రవిడ్‌ 52.31 సగటుతో 13,288 పరుగులు సాధించాడు. ఇందులో 36 శతకాలు, 63 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో 210 క్యాచ్‌లను పట్టి అత్యధిక క్యాచ్‌లను పట్టిన క్రికెటర్‌గా తన పేరిట రికార్డును లిఖించుకున్నాడు. దీంతోపాటు 25 టెస్టుల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దీనిలో భారత్‌ 8 మ్యాచుల్లో విజయం సాధించగా, ఆరు మ్యాచుల్లో ఓటమి పాలైంది. మరో 11 మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి. వన్డేల్లో కూడా ద్రవిడ్‌ అద్భుతంగా రాణించాడు. మొత్తం 344 మ్యాచ్‌లు ఆడిన దివాల్‌ 39.16 సగటుతో 10,889 పరుగులు సాధించాడు. వీటిలో 12 శతకాలు, 83 అర్ధ సెంచరీలు ఉన్నాయి.  ద్రవిడ్‌ 196 క్యాచ్‌లను కూడా పట్టాడు. సమకాలిన క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఖ్యాతి గడించిన ద్రవిడ్‌ భారత్‌ క్రికెట్‌ అందించిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయి. ఉత్తమ టెక్నిక్‌తో భారత ఇన్నింగ్స్‌కు పెట్టని గోడగా నిలిచే ద్రావిడ్‌ను పెవిలియన్‌కు పంపడానికి ఉద్ధండ బౌలర్లు కూడా అష్టకష్టాలు పడాల్సి వచ్చేది.  క్లిష్ట సమయంలోనూ నిబ్బరంగా ఆడే సత్తా ఒక్క ద్రవిడ్‌కే ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. విదేశి గడ్డపై అద్భుత రికార్డు కలిగిన ద్రవిడ్‌ భారత్‌కు ఎన్నో చారిత్రక విజయాలు అందించాడు.కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో హైదరాబాదీ వివిఎస్. లక్ష్మణ్‌తో కలిసి నెలకొల్పిన రికార్డు భాగస్వామ్యం క్రికెట్‌ చరిత్రలోనే అత్యద్భుత ప్రదర్శనల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

           ప్రపంచ క్రికెట్‌లో ద్రవిడ్‌ అద్భుత ఆటగాడు. ఆటగాడిగా ద్రవిడ్‌ స్థానాన్ని భర్తీ చేయడం దాదాపు అసాధ్యము.  భారత్‌కు లభించిన ఆణిముత్యాల్లో ద్రవిడ్‌ ఒకడు. సుదీర్ఘ కెరీర్‌లో ద్రవిడ్‌ సాగించిన ప్రస్థానం, భారత జట్టుకు చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టిన ఘనత ద్రవిడ్‌కే దక్కుతుంది.

Thursday, March 8, 2012

ఆకాశంలో సగం ...


నేడు 102 వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

               మహిళా దినోత్సవాలెన్ని జరుపుకున్నా ఆకాశంలో సగ భాగంగా ఉన్న మహిళల స్థితిగతుల్లో ఆశించిన మార్పు రాలేదు. అసమానత, అణచివేత, దోపిడీ అంతంకాలేదు. గత రెండు దశాబ్దాలుగా పాలకులు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలు, పెంచిపోషిస్తున్న వినిమయ, వినోద సంస్కృతి మహిళలను కడగండ్లపాల్జేస్తున్నాయి. సామాజిక, ఆర్థిక పరంగా మహిళలపై దాడులకు ఆజ్యం పోస్తున్నాయి. ఈ విధంగా స్త్రీ అస్తిత్వానికే ఇవి సవాల్‌గా పరిణమించాయి. సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానం, మత ఛాందసవాదం సాగిస్తున్న ఈ ముప్పేట దాడికి ప్రతిఘటన కూడా పెరుగుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలు తమ అస్థిత్వం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. మహిళా దినోత్సవం నాడు దోపిడీ, అణచివేత, హింస, అసమానతల నుండి విముక్తి కోసం శ్రామిక మహిళలు పోరాడి రక్తతర్పణ చేసిన చారిత్రాత్మక రోజు అయిన ఈ మహిళా దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ ఉద్యమాలను మరింత ఉధృతం చేయాల్సిన అవసరముంది. మహిళ ఉద్యమాలకు దిక్చూచి. 

                చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే చట్టం పట్ల బోలెడు శ్రద్ధాసక్తులు ప్రదర్శిస్తూనే మోకాలడ్డుతున్నారందరూ. వామపక్షాలు మాత్రమే దీనికి మినహాయింపు. కేరళలో సిపిఎం ఆధ్వర్యంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థలో 50శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది. అలాగే చట్ట సభల్లో మహిళలరిజర్వేషన్ల బిల్లుకు వామపక్షాలు సంపూర్ణ మద్దతునిస్తున్నాయి. ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించినా సోనియా గాంధీ నాయకత్వంలోని యుపిఏ సర్కార్‌ 'ఏకాభిప్రాయం కోసం' అంటూ లోక్‌సభలో పెట్టకుండా వాయిదాలు వేస్తున్నది. 

           అంతర్జాతీయ మహిళా దినోత్సవం  ( మార్చి 8)

Tuesday, February 28, 2012

భారత్ సంచలన విజయం...


36.4 ఓవర్లలో 321 లక్ష్యాన్ని ఛేదించిన ఇండియా
లంకపై 7 వికెట్ల తేడాతో గెలుపు

     ముక్కోణపు సిరీస్ వన్డేలో భారత్-శ్రీలంక మధ్య మంగళవారం  జరిగిన మ్యాచ్‌లో ఇండియా 36.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఈ టూర్‌లో ఇండియా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఈరోజు లంకపై విజయం సాధించి, ఫైనల్‌కు ఆశలు సజీవంగా ఉంచుకోవడంతో అందరిలోనూ సంతోషం వెల్లివిరిసింది. భారత్ 36.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. విరాట్ కోహ్లీ 88 బంతులలో 133 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, గౌతమ్ గంభీర్ 63, సచిన్ : 39, సెహ్వాగ్ : 30 పరుగులు చేశారు. కాగా టీంఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

         అంతకు ముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసి 321 పరుగుల విజయలక్ష్యాన్ని ఇండియా ముందుంచింది. మ్యాచ్ ప్రారంభం నుంచి నిలకడగా ఆడిన శ్రీలంక భారీ స్కోర్ చేసింది. దిల్షాన్ సంగక్కర పరుగుల వర్షం కురిపించి ఇండియా బౌలర్లకు చెమటలు పట్టించారు. జయవర్ధనే : 22, దిల్షాన్ (నాటౌట్) : 160, సంగక్కర : 105, పెర్రారా : 3, మేథౌస్ : 14, ఛండిమల్ (నాటౌట్) : 2

         విమర్శకుల మాటలకు తన అద్భుత బ్యాటింగ్‌తో భారత జట్టు సమాధానం చెప్పింది. ఫైనల్‌కు చేరాలంటే బోనస్ పాయింట్‌తో గెలవాల్సిన తరుణంలో శ్రీలంకతో జరిగిన కీలక వన్డేలో భారత్ అద్భుత ఆటతీరు ప్రదర్శించి ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు బ్యాట్స్‌మెన్ ఏ దశలోనూ వెనక్కి చూడకుండా ఆకాశమే హద్దుగా చెలరేగారు. భారత జట్టు బోనస్ పాయింట్‌తో సహా 15 పాయింట్లు పొంది ఫైనల్ ఆశలు సజీవంగా నిలుపుకుంది.

భారత్ సంచలన విజయం...


36.4 ఓవర్లలో 321 లక్ష్యాన్ని ఛేదించిన ఇండియా
లంకపై 7 వికెట్ల తేడాతో గెలుపు

     ముక్కోణపు సిరీస్ వన్డేలో భారత్-శ్రీలంక మధ్య మంగళవారం  జరిగిన మ్యాచ్‌లో ఇండియా 36.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఈ టూర్‌లో ఇండియా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఈరోజు లంకపై విజయం సాధించి, ఫైనల్‌కు ఆశలు సజీవంగా ఉంచుకోవడంతో అందరిలోనూ సంతోషం వెల్లివిరిసింది. భారత్ 36.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. విరాట్ కోహ్లీ 88 బంతులలో 133 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, గౌతమ్ గంభీర్ 63, సచిన్ : 39, సెహ్వాగ్ : 30 పరుగులు చేశారు. కాగా టీంఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

         అంతకు ముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసి 321 పరుగుల విజయలక్ష్యాన్ని ఇండియా ముందుంచింది. మ్యాచ్ ప్రారంభం నుంచి నిలకడగా ఆడిన శ్రీలంక భారీ స్కోర్ చేసింది. దిల్షాన్ సంగక్కర పరుగుల వర్షం కురిపించి ఇండియా బౌలర్లకు చెమటలు పట్టించారు. జయవర్ధనే : 22, దిల్షాన్ (నాటౌట్) : 160, సంగక్కర : 105, పెర్రారా : 3, మేథౌస్ : 14, ఛండిమల్ (నాటౌట్) : 2

         విమర్శకుల మాటలకు తన అద్భుత బ్యాటింగ్‌తో భారత జట్టు సమాధానం చెప్పింది. ఫైనల్‌కు చేరాలంటే బోనస్ పాయింట్‌తో గెలవాల్సిన తరుణంలో శ్రీలంకతో జరిగిన కీలక వన్డేలో భారత్ అద్భుత ఆటతీరు ప్రదర్శించి ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు బ్యాట్స్‌మెన్ ఏ దశలోనూ వెనక్కి చూడకుండా ఆకాశమే హద్దుగా చెలరేగారు. భారత జట్టు బోనస్ పాయింట్‌తో సహా 15 పాయింట్లు పొంది ఫైనల్ ఆశలు సజీవంగా నిలుపుకుంది.

జాతీయ విజ్ఞాన దినోత్సవ శుభాకాంక్షలు ....

              చంద్రశేఖర్‌ వెంకట రామన్‌ (సి.వి.రామన్‌) ఎఫెక్టును కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవం జపుతారు. ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి, రువైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్‌ బహుమతి విజేతగా నిలిచారు. కేంద్రప్రభుత్వం భారతరత్న బహుకరించింది.


      మానవ సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసిన వాటిలో శాస్త్ర సాంకేతిక రంగాలది ప్రథమస్థానం. సామాజిక జీవన ప్రమాణాల్ని, ఆర్థిక సంబంధాల్ని, సాంస్కృతిక నియమాల్నే గాక ప్రకృతి, భౌతిక ప్రపంచం గురించిన తాత్విక పరిజ్ఞానానికి శాస్త్రీయ పునాదిని కూడా శాస్త్ర సాంకేతిక రంగాలే సమకూర్చాయి.

             స్వేచ్ఛ, స్వాతంత్య్రం, స్వయంపాలన, స్వయంప్రతిపత్తి వంటి వాదనలు బలపడుతున్న స్థితిలో ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న ఆయుధ సంపత్తితో, పెద్దయెత్తున వినాశకర అణ్వాయుధాల తయారీకి, ఆధునిక రహస్య గూఢచర్యం కోసం వాడుతూ ఈ శక్తులు సౖన్సును దుర్వినియోగం చేస్తున్నాయి. ఈ శాస్త్రసాంకేతిక సంపత్తిని గుప్పెట్లో పెట్టుకున్నాయి. సోషలిస్టు ఉత్పత్తి పద్ధతుల్ని దెబ్బతీసేందుకు ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ అనే త్రిముఖ వ్యూహంతో ప్రపంచదేశాల్ని శాసించాలని, ప్రపంచ క్రమాన్ని, పాలనా పద్ధతుల్ని ప్రభావితం చేయాలని చూస్తున్నాయి.

                 విప్లవాత్మకమైన రీతిలో ఖగోళ పరిజ్ఞానం, జీవశాస్త్ర పరిజ్ఞానం, కంప్యూటర్‌ రంగం, పాదార్థిక విజ్ఞానం అభివృద్ధి చెందిన సమయం కూడా అదే! అభివృద్ధి చెందిన శాస్త్ర సాంకేతిక రంగాలకున్న సహజ ప్రవృత్తి ప్రజల్ని మేల్కొలపడం, వారిలో ఆధునిక చైతన్యాన్ని తీసుకురావడం. మానవ చరిత్రలో శాస్త్ర సాంకేతిక రంగాలు ప్రగతిశీల పాత్రను పోషించాయి. కానీ ప్రజల్ని అంధకారంలో ఉంచి పబ్బం గడుపుకొనే శక్తులకిది సమ్మతం కాదు.  పరమత ద్వేషం, అశాస్త్రీయత, మూఢనమ్మకాలు, స్వోత్కర్ష, కుహనా శాస్త్రమనే పునాదుల మీదే మతశక్తులు మనగగలవు.

           ప్రజల దైనందిన అవసరాల ప్రాముఖ్యత కన్నా విలాస వస్తువుల తయారీ, వినియోగతత్వాన్ని పోషించే ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ ప్రధాన రంగాలయ్యాయి. వ్యవసాయం, గృహ నిర్మాణం, రహదారుల నిర్మాణంలో కూడా ఆటోమేషన్‌ రావడంతో ప్రకృతి వనరులు హరించుకుపోతున్నాయి. జీవ సమతుల్యం, వనరుల సమతుల్యం దెబ్బతినడంతో పాటు, పర్యావరణ కాలుష్యం ఒక్కసారిగా పెరిగిపోయింది. నూతన ఆర్థిక పారిశ్రామికీకరణ పద్ధతులు అమల్లోకి వచ్చాక ఆబగా ప్రకృతి వనరుల్ని కొల్లగొట్టడంతో పాటు శత్రు వినాశనానికి వీలు కల్పించే రసాయనిక, క్రిమి ఆయుధాల తయారీ పరాకాష్టకు చేరుకుంది. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన, ఎయిడ్స్‌ వ్యాధి వంటివి యుద్ధోన్మాదుల ప్రాయోజిత ప్రయోగాల ఫలితాలేనని ఎన్నో పరిశోధనలు రుజువు చేశాయి.

            అటువంటి సంధి దశలో ప్రజలపక్షాన నిలిచే అభ్యుదయశక్తులు, ప్రభుత్వేతర సంస్థలు ఐక్యమై బలమైన ప్రజాసైన్సు ఉద్యమాన్ని చేపట్టవలసిన చారిత్రిక అవసరమేర్పడింది. ప్రజల్లో అశాస్త్రీయపుటంధకారం నుంచి వైజ్ఞానిక వెలుగువైపు నడిపించేందుకు, శాస్త్ర సాంకేతిక రంగాల్ని ప్రజాబాహుళ్యపు సమిష్టి ప్రయోజనాలకు సాధనాలుగా మార్చే ప్రక్రియకు బలాన్ని జోడించేందుకు ప్రజాసైన్స్‌ ఉద్యమ అవసరం ఏర్పడింది. ఆ స్ఫూర్తితో 1988 ఫిబ్రవరి 28న పురుడుపోసుకున్న 'జనవిజ్ఞాన వేదిక' కూడా తన 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టి, రజతోత్సవం జరుపుకుంటున్నది.

Tuesday, February 21, 2012

దేశభాషలందు తెలుగు లెస్స...

                           అందరికి మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో...

భాషలన్నింటిలో మాతృభాషకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.శిశువు మొట్టమొదట నేర్చుకునే భాషే తల్లిబాష. శిశువు సహజరీతిలో నేర్చుకొనే భాష 'మాతృభాష'. ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతీయ భాష మాతృభాష అవుతుంది. శ్రీకృష్ణదేవరాయలు మన తెలుగును దేశభాషలందు తెలుగు లెస్స అని కొనియాడారు.


              భారత రాజ్యాంగంలోని 345 అధికరణం ప్రకారం ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి రాష్ట్రాలకు అధికారమిచ్చింది. 1966లో ఆంధ్రప్రదేశ్‌ శాసనవిభాగం అధికార భాషా శాసనాన్ని తయారు చేసింది. త్రిభాషా సూత్రాన్ని కూడా ప్రతిపాదించారు. మాతృభాష తెలుగును ప్రథమ, జాతీయ బాష హిందిని ద్వితీయ, ఆంగ్లబాషను తృతీయ భాషలుగా ప్రతిపాదించారు.
రాష్ట్ర ప్రభుత్వం 1969లో ఇంటర్మీడియట్‌ తరగతులకు తెలుగును బోధ భాషగా ప్రవేశపెట్టింది. 1971లో డిగ్రీ కళాశాల జరగాలని నిర్ణయించారు.

నేడు  అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా. (ఫిబ్రవరి 21)

Wednesday, February 15, 2012

పేదలకు నీటి చుక్క లేన్నట్లెనా...?

                  తిండి దొరక్కపోతే కనీసం నీళ్లు తాగి బతికే పేదలకు ఇక అవి కూడా ఉచితంగా దొరకని దౌర్భాగ్య పరిస్థితులు దాపురించాయి. దేశంలో కలుషిత నీటిని తాగడం వల్ల జరిగే మరణాలే ఎక్కువ. ఇలాంటి అనుభవాలు ముందుండగానే కేంద్రం కొత్త జల విధానంలో  ప్రజలపై, రైతులపై భారాలు మోపడానికి ఎలాంటి జంకు లేకుండా సిద్ధమైందని అర్థమవుతుంది. నగరాలు, పట్టణాల్లో విషమ షరతులు విధించి పన్నులతో ప్రజల నడ్డి విరగ్గొడుతున్నారు.

                   మనిషికి ప్రాణాధారమైన నీటిని ప్రైవేటీకరించి వ్యాపార సరుకుగా మార్చడం నుండి మరెన్నో వినాశకర అంశాలు కొత్త జల విధాన ముసాయిదాలో చోటు చేసుకున్నాయని,  నీటి పంపిణీ సేవల ప్రైవేటీకరణ జల విధానంలో ప్రధానాంశమని వార్తలొస్తున్నాయి. అదే నిజమైతే అంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండబోదు. నీటిని ప్రైవేటీకరిస్తే చుక్క చుక్కను లెక్కగట్టి ధరలు నిర్ణయించి రైతులు, ఇతర వినియోగదారుల నుండి ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు. అంతే కాదు నిర్వహణ, పాలనా పరమైన ఖర్చుల మొత్తాన్నీ నీటిని వాడుకునే వారి నుండి ఎలాంటి రాయితీలు ఇవ్వకుండా రాబడతారు.


          ఒక్క మాటలో చెప్పాలంటే నీటి పంపణీ బాధ్యత నుండి ప్రభుత్వం వైదొలుగుతుంది. ప్రకృతి ప్రసాదించిన నీటిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు అందించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకపోగా మొత్తంగా ఆ రంగం నుండి వైదొలగడం గర్హనీయం.
 

Saturday, February 11, 2012

ప్రజావ్యతిరేక విధానాలు, అవినీతిపై వామపక్షాలే పోరాడుతున్నాయి - ప్రకాశ్‌ కరత్‌

  • సిపిఎం కేరళ రాష్ట్ర మహాసభల ముగింపు సభలో కరత్‌
  • తిరువనంతపురంలో రెడ్‌ షర్ట్‌ వాలంటీర్ల భారీ కవాతు
  • కార్యదర్శిగా పినరయి తిరిగి ఎన్నిక
             సిపిఎం కేరళ రాష్ట్ర మహాసభల ముగింపు ఈ సందర్భంగా సభకు ముఖ్య అతిధిగా హాజరైన పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ మాట్లాడుతూ... దేశంలో ప్రజావ్యతిరేక విధానాలు, అవినీతిపై పోరాడుతోంది వామపక్షాలు మాత్రమేనని చెప్పారు. ప్రజలు కూడా ఈ విషయాన్ని గుర్తించారన్నారు. లౌకిక, ప్రజాతంత్ర శక్తులతో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసేందుకు సిపిఎం చొరవ తీసుకుంటుందని చెప్పారు. మూడేళ్ల యుపిఎ-2 పాలనలో ధరల పెరుగుదల, నిరుద్యోగిత తీవ్రమైందని విమర్శించారు. ప్రజావ్యతిరేక నయా ఉదారవాద విధానాల వల్ల వేలాది మంది అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క జనవరిలోనే 160 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. కేరళలో రైతుల ఆత్మహత్యలు తిరిగి ప్రారంభమయ్యాయని, ఊమెన్‌చాందీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 31 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారని అన్నారు. 34 ఏళ్ల వామపక్ష ప్రభుత్వంలో బెంగాల్‌లో ఎన్నడూ వినని రైతు ఆత్మహత్యలు ఇప్పుడు వినిపిస్తున్నాయని, మమతా బెనర్జీ అధికారం చేపట్టాక ముడు పదులకు పైగా అన్నదాతలు బలయ్యారని అన్నారు. అనంతరం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కరత్‌, కొడియేరి బాలకృష్ణన్‌, పినరయి విజయన్‌, సిపిఎం శాసన సభాపక్ష నేత విఎస్‌ అచ్యుతానందన్‌, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి కడకంపల్లి సురేంద్రన్‌ ప్రసంగించారు.
                      సిపిఐ(ఎం) కేరళ రాష్ట్ర 20వ మహాసభలు శుక్రవారం తిరువనంతపురంలో జరిగిన భారీ బహిరంగ సభతో ముగిశాయి. ముగింపు సందర్భంగా అశేష జనవాహినితో నిర్వహించిన భారీ ర్యాలీతో రాజధాని నగరం తిరువనంతపురం ఎర్ర సముద్రాన్ని తలపించింది. దాదాపుగా 3 లక్షల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నగరంలోని ఐదు ప్రధాన రోడ్ల గుండా సాగిన ఈ ర్యాలీలో 25 వేల మంది రెడ్‌షర్ట్‌ వాలంటీర్ల కవాతు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆద్యంతం అత్యంత క్రమశిక్షణతో సాగి, కమ్యూనిస్టు ఉద్యమ బలాన్ని చాటిన ఈ ర్యాలీలు ఇ బాలానందన్‌ నగర్‌ (చంద్రశేఖరన్‌ నాయర్‌ స్టేడియం)లో కలిశాయి. రైతులు, వివిధ రంగాల కార్మికులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువజనులు, విద్యార్థులు, ఉద్యోగులు ర్యాలీకి పెద్ద ఎత్తున తరలివచ్చారు.
( ప్రజాశక్తి సౌజన్యంతో..... ) 

Wednesday, February 8, 2012

భారత్ విజయం ..

   ముక్కోణపు సిరీస్‌లో భాగంగా భారత్-శ్రీలంక మధ్య ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్‌లో (పెర్త్, ) బుధవారం జరుగుతున్న ఒన్డేలో లంకపై భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 44.6 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఈసారి కూడా  సచిన్ టెండూల్కర్ సెంచరీ చేస్తారన్న అభిమానులకు నిరాసే మిగిల్చారు. 48 పరుగుల వద్ద ఔట్ అయ్యారు. విరాట్ కోహ్లీ 77 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు.  కోహ్లీ : 77,  సచిన్ : 48, ఆశ్విన్ (నాటౌట్) : 30,   రైనా : 24, జడేజా (నాటౌట్) : 24,  సెహ్వాగ్ - 10, శర్మ : 10, కెప్టెన్ ధోనీ : 4, 

                      టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసి, 234 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. శ్రీలంక ఆటగాళ్లలో చండీమాల్ ఒక్కరే ఆఫ్‌సెంచరీ చేశారు. భారత్ బౌలర్లలో అశ్విన్ 3, జహీర్ ఖాన్ 2 వికెట్లను తీసుకున్నారు.
     తరంగ : 4, దిల్‌షా : 48, సంగక్కర : 26, చండిమాల్ : 64, జయవర్ధనే : 23, పెరెరా : 7, బాథేవ్స్ : 33,
                     ఇప్పటికే   ఒటమిలతో భారత్  నడుస్తూన్నది.    
  ఒన్డేల 
సిరీస్‌లో ఐన భారత్  ఘనవిజయం సాధించాలని  కొరుకుందాం.   

Friday, February 3, 2012

కాజేసింది కక్కించాలి - ప్రకాశ్‌ కరత్‌

  • 2జిపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం
  • రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానం
  • బెంగాల్‌దీ అదే దారి
  • వామపక్ష ప్రజాతంత్రమే ప్రత్యామ్నాయం
  • సిపిఎం రాష్ట్ర మహాసభ ప్రారంభ సభలో ప్రకాశ్‌ కరత్‌
             కార్పొరేట్‌ అవినీతికారణంగా దేశం నఫ్టపోయిన మొత్తాన్ని ఆ సంస్థల నుండి వసూలు చేయాలని సిపిఎం ప్రధానకార్యదర్శి ప్రకాశ్‌కరత్‌ డిమాండ్‌ చేశారు.  ఖమ్మంలో సిపిఎం 23వ రాష్ట్ర మహాసభలను ప్రకాష్‌ కరత్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడ్డ కార్పొరేట్‌ సంస్థలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. 2జి కుంభకోణంలో అక్రమాలకు పాల్పడ్డ కార్పొరేట్‌ సంస్థల లైసెన్స్‌లు రద్దు చేయాలంటూ ఇచ్చిన తీర్పును చారిత్రాత్మకమైనదిగా ఆయన అభివర్ణించారు. వాస్తవానికి సిపిఎం మొదటి నుండి డిమాండ్‌ చేస్తోందని చెప్పారు. 2జి స్పెక్ట్రమ్‌ కంభకోణంలో122 సంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయని వాటి లైసెన్స్‌లు రద్దు చేయాలని తాము కోరినట్లుచెప్పారు. ట్రారుకూడా73 సంస్థల లైసెన్స్‌లు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించిందని తెలిపారు. అయితే, కేంద్ర మంత్రి కపిల్‌ సిబాల్‌ ఈ సూచనను తిరస్కరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. లైసెన్స్‌లు రద్దు చేస్తే కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వంపై నమ్మకం పోతుందని, పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావని వాదించారని తెలిపారు. ఈ తరహా అవినీతిని దృష్టిలో ఉంచుకునే లోక్‌పాల్‌ పరిధిలోకి కార్పొరేట్‌ సంస్థలను తీసుకురావాలని తాము డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం రూపొందించిన లోక్‌పాల్‌ బిల్లు వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని ఆయన అన్నారు. లోక్‌పాల్‌ తోనే అవినీతిమొత్తం అంతమౌతుందన్న అభిప్రాయం కూడా సరికాదని చెప్పారు.

 

Tuesday, January 31, 2012

దోపిడీ వ్యవస్థలో మార్పు తేవటానికి ప్రజలు ముందుకు రావాలి - సీతారాం ఏచూరి

  • సీతారాం ఏచూరి ఉద్ఘాటన
  • భవిష్యత్తు అరుణ పతాకదే
                       ప్రస్తుతం దేశ ప్రజలకు కావల్సింది కార్పొరేట్‌, సామ్రాజ్యవాద అనుకూల విధానాలు కాదని, వామపక్ష ప్రజాతంత్ర విధానాలు అవసరమని సిపిఎం నేత సీతారాం ఏచూరి ఉద్ఘాటించారు. సిపిఎం హర్యానా రాష్ట్ర మహాసభల ముగింపు అనంతరం పట్టణంలోని హుడా పార్క్‌లో సోమవారం జరిగిన భారీ బహిరంగసభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ప్రస్తుతం కొనసాగుతున్న దోపిడీ వ్యవస్థలో మార్పు తేవటానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  కొద్దిమంది పెట్టుబడిదారులకు కాక పేద, బడుగు, బలహీన వర్గాల కోసం మెరుగైన భారతాన్ని నిర్మించేందుకు సూచిక అని అభివర్ణించారు. ప్రస్తుతం అమెరికా, ఐరోపా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభాన్ని, పెట్టుబడిదారీ వ్యవస్థపై ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న తిరుగుబాట్లను ప్రస్తావిస్తూ సోషలిజానికి మాత్రమే భవిష్యత్తు ఉందని స్పష్టం చేశారు. 'భవిష్యత్తు అరుణ పతాకదే తప్ప పెట్టుబడి దారులది కాదు' అన్నారు. చిల్లర వాణిజ్యంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించటాన్ని, ప్రస్తుతం పార్లమెంట్‌లో పెండింగ్‌లో వున్న పెన్షన్‌ నిధుల నియంత్రణ (పిఎఘఆర్‌డిఎ) బిల్లును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

Sunday, January 29, 2012

స్వతంత్ర శక్తిగా ఎదగడమే లక్ష్యం - ప్రకాశ్‌ కరత్‌

  • వామపక్ష, ప్రజాతంత్ర ప్రత్యామ్నాయానికై కృషి
  • ఆర్థిక సంస్కరణలపై విశాల ప్రజా ఉద్యమం
  • మతోన్మాదంపై పోరాటం కొనసాగిస్తాం
  • ముసాయిదా రాజకీయ తీర్మానంలో సిపిఎం
'               ఎన్నికల వైఫల్యాలు, పార్టీకి అత్యంత బలమైన బెంగాల్‌లో జరుగుతోన్న దాడి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో పార్టీ ప్రభావాన్ని, పునాదిని విస్తరింప చేయడం అత్యంత ప్రధానం. పార్టీ స్వతంత్ర కార్యాచరణను పెంపొందించడం, విస్తరింప చేయడం ద్వారానే ఇది సాధ్యం. పార్టీ పెరుగుదలకు ఇదే కీలకం..' అని సిపిఎం ముసాయిదా రాజకీయ తీర్మానం పేర్కొంది. దేశంలో వామపక్ష, ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం రూపకల్పనే లక్ష్యంగా రాజకీయ కార్యాచరణ ఉండాలని పిలుపునిచ్చింది. ఏప్రిల్‌ 4 నుండి 9 వరకూ పార్టీ అఖిలభారత మహాసభ కేరళలోని కోజికోడ్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ ముసాయిదా తీర్మానంపై సూచనలు,సవరణలను ఆహ్వానించారు. ఇటీవల కోల్‌కతాలో జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో ముసాయిదా రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌, పొలిట్‌బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి, వరదరాజన్‌ ముసాయిదాను విడుదల చేశారు. ' పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేయాలని, స్వతంత్ర పాత్రను పెంపొందించాలని తీర్మానం పేర్కొంది. కాంగ్రెస్‌, బిజెపిలకు వ్యతిరేకంగా దేశంలో కలిసి వచ్చే రాజకీయ పార్టీలను అంశాల వారీగా సమీకరిస్తాం. వామపక్ష, ప్రజాతంత్ర ప్రత్యామ్నాయాన్ని ఏర్పర్చాలన్న దీర్ఘకాల లక్ష్యంలో ఇదీ భాగమే ' అని ఈ సందర్భంగా కరత్‌ వ్యాఖ్యానించారు. 2008లో జరిగిన పార్టీ మహాసభ అనంతరం జరిగిన ముఖ్యమైన అంతర్జాతీయ, జాతీయ పరిణా మాలను ముసాయిదాలో పొందు పర్చినట్లు చెప్పారు. ముసాయిదాలోని ప్రధాన అంశాలను ఆయన మీడియాకు వివరించారు. 2007-08లో ప్రారంభమైన అంతర్జాతీయ పెట్టుబడిదారీ సంక్షోభం కొనసాగుతోందన్నారు. ఫలితంగా అమెరికాతో పాటు యూరప్‌లోని పలు అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక సమస్యలతో సతమతమౌతున్నాయని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వ కోతలు, నిరుద్యోగం పెరగడం ఈ దేశాలన్నింటిలోనూ ఉమ్మడిగా కనిపిస్తోందన్నారు. సంక్షోభం నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ కార్మికులు, ఉద్యోగులు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటాల్లోకి వస్తున్నారని చెప్పారు. ఈ కాలంలో అరబ్‌ దేశాల్లోనూ పలు చోట్ల ప్రజాస్వామ్య ఉద్యమాలు పెల్లుబికాయని, ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి నాటో రూపంలో అమెరికా కుట్రలు చేస్తోందని వ్యాఖ్యానించారు. 
              లాటిన్‌ అమెరికా దేశాల్లోనూ వామపక్ష శక్తులు ఈ కాలంలో పుంజుకున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతమయ్యేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ' పెట్టుబడి దారీ వ్యవస్థకు ఇక తిరుగేలేదని సరిగ్గా రెండు దశాబ్ధాల క్రితం అన్నారు. ఇప్పుడు ఆ వాదన మసకబారుతోంది. పెట్టు బడిదారీ వ్యవస్థ మనుగడపైనే మేథావు లందరూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. సోషలిజమే అజేయమన్న నినాదానికి ఇప్పుడు మరింత ప్రాధాన్యత ఏర్పడింది ' అని కరత్‌ వ్యాఖ్యానించారు.
( ప్రజాశక్తి సౌజన్యంతో..... )