ప్రస్తుతం దేశ ప్రజలకు కావల్సింది కార్పొరేట్, సామ్రాజ్యవాద అనుకూల విధానాలు కాదని, వామపక్ష ప్రజాతంత్ర విధానాలు అవసరమని సిపిఎం నేత సీతారాం ఏచూరి ఉద్ఘాటించారు. సిపిఎం హర్యానా రాష్ట్ర మహాసభల ముగింపు అనంతరం పట్టణంలోని హుడా పార్క్లో సోమవారం జరిగిన భారీ బహిరంగసభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ప్రస్తుతం కొనసాగుతున్న దోపిడీ వ్యవస్థలో మార్పు తేవటానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కొద్దిమంది పెట్టుబడిదారులకు కాక పేద, బడుగు, బలహీన వర్గాల కోసం మెరుగైన భారతాన్ని నిర్మించేందుకు సూచిక అని అభివర్ణించారు. ప్రస్తుతం అమెరికా, ఐరోపా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభాన్ని, పెట్టుబడిదారీ వ్యవస్థపై ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న తిరుగుబాట్లను ప్రస్తావిస్తూ సోషలిజానికి మాత్రమే భవిష్యత్తు ఉందని స్పష్టం చేశారు. 'భవిష్యత్తు అరుణ పతాకదే తప్ప పెట్టుబడి దారులది కాదు' అన్నారు. చిల్లర వాణిజ్యంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించటాన్ని, ప్రస్తుతం పార్లమెంట్లో పెండింగ్లో వున్న పెన్షన్ నిధుల నియంత్రణ (పిఎఘఆర్డిఎ) బిల్లును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
No comments:
Post a Comment