Friday, June 14, 2013

ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా...

ప్రపంచ విప్లవకారుడు చేగువేరా.

  చేగువేరా 1928, జూన్‌ 14న అర్జెంటీనాలో జన్మించారు. వైద్యవిద్యను పూర్తి చేసి లాటిన్‌ అమెరికా దేశాల్లో అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడారు. క్యూబా గెరిల్లా పోరాటంలో చేరి విప్లవోద్యమానికి అంకితమయ్యారు. క్యూబాలో విప్లవం జయప్రదం అయిన తర్వాత మంత్రి పదవిని సైతం వదిలి బొలీవియాలోనూ ఉద్యమించడానికి బయలుదేరారు.
 ఆయన చేసిన పోరాటం ప్రపంచ వ్యాప్తంగా ప్రజాతంత్ర వాదులకు, యువతకు సమాజ మార్పును కోరే అందరికీ ఆదర్శప్రాయం.  ప్రజలకే చెగువేరా జీవితాన్ని అంకితమిచ్చారు. చెగువేరా స్ఫూర్తితో ప్రస్తుతమూ అమెరికా సామ్రాజ్యవాదానికి, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం. 

 చేగువేరా 85వ జయంతి

Tuesday, May 28, 2013

తెలుగువారికి ప్రపంచవ్యాప్త గుర్తింపును సాధించిపెట్టాడు...

           
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా తెలుగువారి గుండెల్లో చోటు సంపాదించుకున్న వ్యక్తి నందమూరి తారకరామారావు. కొన్ని దశాబ్దాలపాటు సాగిన కృషి, పట్టుదల వల్ల ఆయన సాగించిన నట యాత్ర అనన్య సామాన్యమైంది. తెరపైన కథానాయకుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించి, నిజ జీవిత కథానాయకుడిగా తెలుగువారి ముంగిట నిలబడ్డాడు. తెలుగు సినిమాకు, తెలుగు భాషకు, తెలుగువారికి ప్రపంచవ్యాప్త గుర్తింపును సాధించిపెట్టాడు. ముఖ్యంగా తెలుగు సినిమాపై ఆయన చెదిరిపోని ముద్ర వేశారు. రాజకీయాల్లోకి వెళ్లిన దాదాపు పదేళ్ల తరువాత తిరిగి సినిమాల్లో నటించి విజయం సాధించిన ఘనత ఆయనదే.

     భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఎందరో మహా నటులున్నారు.వారందరూ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. కానీ ఏ నటుడు నటించనీ, చేయలేని పాత్రలు చేసిన ఏకైక నటుడు నందమూరి తారకరామారావు. వందేళ్ళ సినీ చరిత్రలో ఆయనదో చరిత్ర.

 మే 28 ఎన్‌టి.రామారావు పుట్టినరోజు.

Wednesday, May 1, 2013

ప్రతిధ్వనించిన రోజు ... mayday



'ప్రపంచ కార్మికులారా! ఏకం కండీ  అంటూ ప్రతిధ్వనించిన రోజు  
 శ్రామికులందరూ ఆనందంతో జరుపుకునే పండుగ రోజు  'మేడే'!


మేడే కార్మికవర్గానికి స్ఫూర్తినిచ్చేరోజు.
ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాడి చనిపోయిన అమరవీరులకు నివాళలు అర్పించేరోజు.
కార్మికవర్గం తమ పోరాటాలను సమీక్షించుకొని ముందడుగు వేసేరోజు.
తమను దోపిడీకి గురి చేసే పెట్టుబడిదారీ విధానం అంతం కోసం ప్రతిఙ్ఞ చేసే రోజు.

               ఇప్పటికి 127 ఏళ్ళ క్రితం మే 1వ తేదీన ప్రారంభమైన కార్మికోద్యమాన్ని అణచాలని పెట్టుబడిదారీవర్గం అనుకుంటే అది ప్రపంచ మంతా అల్లుకుంది. ఆ రణన్నినాదం దేశ దేశాలను చుట్టుముట్టింది. 1889లో ప్యారిస్‌లో జరిగిన రెండో అంతర్జా తీయ కార్మికసంఘం ప్రథమ మహా సభ ప్రతి మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరపాలని తీర్మా నించింది. ఎనిమిది గంటల పని దినం, ప్రజాస్వామ్యం, కార్మిక హక్కుల కోసం ఉద్యమించా లని నిర్ణయించింది. 1917కు కార్మికవర్గం సోవియట్‌లో రాజ్యాధికారానికి వచ్చిన తరువాత ప్రపంచమంతా 8 గంటల పనిదినాన్ని చట్ట బద్ధంగా అంగీకరించాల్సి వచ్చింది. ఇది కార్మికులు సాధించిన విజయం. చరిత్ర మర్చిపోని ఈ అధ్యాయాన్ని స్మరించి, ఆ స్ఫూర్తితో ముందుకు సాగడమే శ్రమ జీవుల కర్తవ్యం.

  అందరికీ 'మేడే' శుభాకాంక్షలు!

Thursday, April 11, 2013

సామాజికోద్యమ చైతన్య జ్వాల ...



               సామాజికోద్యమ చైతన్య జ్వాల జ్యోతిరావుబాఫూలే. నేడు మహాత్మ జ్యోతిరావు బాపూలే జయంతి. జయంతిని దేశ ప్రజలు ఏప్రెల్‌ 11న జరుపుకుంటారు. దేశంలో రాజ్యాధికారం హస్తగతం చేసుకుని పెత్తందారి విధానాలతో కులాలను విడగొట్టి బ్రాహ్మణ ఆదిపత్యాన్ని ప్రదర్శిస్తున్న అగ్రకులాలపై యుద్ధం ప్రకటించారు ఫూలే. కులమత ఆధిపత్యాలను చీల్చి చెండాడిని సామాజిక విప్తవయోధుడాయన. మహాత్మా జ్యోతిరావు బాఫూలే 1827 ఏప్రిల్‌ 11న మహారాష్ట్రలోని పూణేకు సమీపంలో ఉన్న 'సతారా'లో 'మాలి' అనే శూద్రకులంలో జన్మించారు. ఆయనకు 1840లో సావిత్రి బాపూలేతో బాల్య వివాహం జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్‌లో అగ్రకుల పెత్తందారీ తనాన్ని, బ్రాహ్మణ కులవ్యవస్థ నుంచి ప్రజలకు స్వేచ్చా, స్వాతంత్య్రాలను కల్పించలేని ఆపార్టీ ప్రవచించే జాతీయ వాదానికి అర్థం లేదని చెప్పారు. 1873లో 'గులాంగిరి' అనే గ్రంధాన్ని ప్రచురించి ప్రాచుర్యం పొందారు. బ్రాహ్మణులు సాగించిన అన్యాయాలను, అంటరాని తనాన్ని, వివక్ష రూపాలను, అణచివేతను గులాంగిరి గ్రంథంలో ఆయన సమగ్రంగా వివరించారు. నిచ్చేన మెట్ల సమాజంలో దళితులు ఎదుర్కొంటున్న క్లిస్ట సమస్యలను 'తృతీయరత్న ' నాటకంలో కళ్లకుగట్టినట్లు వివరించారు. కుల, మత ఆగడాలను తన రచనల ద్వారా ప్రచారం చేశారు. దళిత కౌలు రైతులు మౌలిక సమస్యలను అధిగమంచేందుకు , మెలుకువలు తెలిపేందుకు పూలే క్షేత్రస్థాయిలో దర్శించారు.
                 ఇల్లాలి చదువు -ఇంటికి వెలుగు అనే సామాజిక భావనను అనేనినాదంతో బాలికలకు ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఆయన భార్యకు విద్యను నేర్పి తొలి మహిళా ఉపాధ్యాయినిగా ఆమె స్థానాన్ని సుస్థిరం చేశారు. ''సత్యశోధక సమాజ్‌'' అనే సంస్థద్వారా ఆధిపత్య కులాల సాంస్కృతిక భావజాలానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ భావజాలాన్ని ప్రచారం చేశారు. ఆయన చేసిన చేవలను గుర్తించి ఆనాటి సమాజం ఆయనకు 1888లో 'మహాత్మా ' అని బిరుదు పొందారు. వృద్ధాప్యంలో చేతిలో చిల్లిగవ్వలేకుండా జీవించారు.
              1889లో అక్టోబర్‌లో అస్వస్థతకు గురయి అదే ఏడాది నవంబర్‌28న తుదిశ్వాస వదిలారు.

విజయం చెకూరాలని ఆశిస్తు...

             ఈ విజయనామ సంవత్సరము మీకు అన్ని విషయాలలొ  
                          విజయం చెకూరాలని ఆశిస్తు...   

Saturday, March 23, 2013

యువతకు ఆయన స్ఫూర్తి... ఉత్తేజం...


అసమాన దేశ భక్తులు, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట వేగుచుక్కలైన 
భగత్ సింగ్, రాజ్ గురు,సుఖ్ దేవ్ లు.

.... మీ రక్తం వృద కాదు... మీ అశయలను సాధిస్తాం....

వారి దేశభక్తి, త్యాగ నిరతి యువతకు ఎప్పుడూ స్ఫూర్తి నిస్తూనే ఉంటుంది. 

'షహీద్‌ భగత్‌సింగ్‌ పేరే యువతకు ఉత్తేజం. 
ఆయన స్ఫూర్తి
 పోరాట సంప్రదాయాలకో సంకేతం. 
త్యాగం ఆదర్శానికి నిదర్శనం.
 మూయించిన ఒక వీరుని కంఠం వేయిగొంతుకల విప్లవ శంఖం
              
                     అన్న మహాకవి ఆవేదనను భగభగమండే అగ్నికణం లాంటి భగత్‌సింగ్‌ నిస్వార్థ పోరాట సంప్రదాయాలతో పోల్చడం సమంజసంగా ఉంటుంది. లాహోరు జైల్లో 1931 మార్చి 23న సంధ్యా సమయంలో స్వాతంత్య్రం కావాలి, ఇంక్విలాబ్‌ జిందాబాద్‌, విప్లవం వర్థిల్లాలిః, తెల్లదొరతనం పోవాలి, అన్నందుకు ప్రాణాలు కోల్పోయాడు. కోట్లాది భారతీయుల హృదయాల్లో ఆరని జ్యోతిగా చిరస్థాయిగా నిలిచిపోతాడని ఎవరు ఊహింలేదు.

                         1928 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు ఆర్థిక సంక్షోభం నీలినీడలు భారతదేశంపై కూడా పడ్డాయి. దేశమంతా పెద్ద పెద్ద పోరాటాలు, సమ్మెలు జరిగాయి. సరిగ్గా ఇదే సంవత్సరం సెప్టెంబర్‌లో ఢిల్లీలో అన్ని ప్రాంతాలకు చెందిన విప్లవకారులను సమావేశపరిచి, హిందూస్థాన్‌ సోషలిస్టు ప్రజాతంత్ర సంఘం అనే సంస్థను ఏర్పరిచారు భగత్‌సింగ్‌.  సోషలిజమే పార్టీ లక్ష్యంగా నిర్ణయించారు. పరిస్థితులు త్వరితగతిన మార్పు చెందుతున్నాయి. సైమన్‌ కమిషన్‌ గోబ్యాక్‌ అనే నినాదాలు నిప్పురవ్వల్లా బ్రిటిష్‌ వారిని దహించి వేస్తున్నాయి. దాన్ని సహించలేని వారు పంజాబ్‌ సింహం లాలా లజపతిరాయ్‌ని బలి తీసుకున్నారు. కార్మిక వర్గం వర్థిల్లాలిః, సామ్రాజ్యవాదం నశించాలిః, సోషలిజం వర్థిల్లాలిః, విప్లవం వర్థిల్లాలిః, అంటూ వారు చేసిన నినాదాలతో పార్లమెంటు హాలంతా మారుమ్రోగిపోయింది. ఎవరినో ఒకర్ని చంపేందుకు బాంబులు ఉపయోగించ లేదు. కేవలం చెవిటివాడిగా నటిస్తున్న ప్రభుత్వానికి ప్రజాఘోష వినిపించేందుకు మాత్రమే ఆ చర్య చేపట్టాల్సి వచ్చిందని భగత్‌సింగ్‌ వివరణ ఇచ్చారు.

                 కోర్టులో విచారణ ప్రారంభమైంది. అందరూ ఊహించినట్లుగానే భగత్‌సింగ్‌తో పాటు రాజగురు, సుఖదేవ్‌లకు కూడా ఉరిశిక్షను విధించారు. కోర్టును తమ భావాల ప్రచారానికి వేదికగా ఉపయోగించుకోవాలనుకున్న భగత్‌ సహచరుల కోరిక నెరవేరింది. పరాయి ప్రభుత్వం తన రాక్షస కబంధ హస్తాలతో వజ్రాల్లాంటి ముగ్గురు విప్లవవీరుల్ని సజీవంగా సమాధి చేసేందుకు ముహూర్తం నిర్ణయించింది. 1931 మార్చి 23న లాహోర్‌ జైల్లో టైప్‌మిషన్లు అధికారుల ఆదేశాలను టకటకమంటూ కొడుతున్నాయి. లాహోర్‌ జైల్లో చీకట్లు అంతటా వ్యాపించాయి.  ఇక జీవితంలో భగత్‌సింగ్‌ను చూడబోముః అనే భావన తోటి విప్లవకారుల చేత కన్నీరు పెట్టించింది. భావావేశపరుడయ్యే సమయం ఇంకా రాలేదు శివవర్మ. నేను కొన్ని రోజుల్లోనే అన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతాను. కానీ మీరు దీర్ఘప్రయాణం చేయవలసి ఉంది. బాధ్యత అనే పెద్ద బరువును మోయవలసి వున్నప్పటికీ ఈ సుదీర్ఘ ప్రయాణంలో నీవు అలసిపోవనీ, ధైర్యం కోల్పోవనీ, ఓటమి స్వీకరించి చతికిలబడిపోవని నా గట్టి నమ్మకం, అంటూ స్నేహితుడికి సందేశం ఇచ్చాడు భగత్‌సింగ్‌. 
                 ఆ కర్తవ్య దిశగా నేటి విద్యార్ధి, యువత భగత్‌సింగ్‌ ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి కంకణబద్దులవటమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి.


          భారత స్వాతంత్య్ర సమరంలో భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ లు అమరులైనారు. ఆ యోధులకు వందనాలు.

         భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ ల 82వ వర్ధంతి ( మార్చి 23) సందర్భంగా... 

Wednesday, March 6, 2013

అరుణతార ఛావేజ్‌ ఇకలేరు...

అరుణతార ఛావేజ్‌ ఇకలేరు...


                           కమ్యూనిస్ట్ యోధుడు, వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ ఇక లేరు. కొంతకాలంగా కేన్సర్‌ వ్యాధితో బాధపడుతూ కరాకన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. 58 ఏళ్ల చావెజ్‌ క్యాన్సర్‌ వ్యాధికి కీమో చికిత్స తీసుకున్నారు. అంతుచిక్కని పెల్విస్‌ కేన్సర్‌తో బాధపడుతున్న చావెజ్‌ ఇప్పటికి నాలుగుసార్లు క్యూబా రాజధాని హవానాలో సర్జరీ చేయించుకున్నారు.
                      1954 జులై 28న జన్మించిన చావెజ్ 1999 నుంచి వెనిజులా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. వెనిజులాలో అమెరికా పెత్తనానికి స్వస్తిపలికి సోషలిజానికి పట్టం గట్టిన ఘనత చావెజ్‌దే. సంక్షేమమే తన ధ్యేయమని చాటి దాన్ని అమలు చేసేందుకు అహర్నిశలు కృషి చేశాడు. తన సంస్కరణలతో వెనెజులా వాసుల హృదయాలతో పాటు అమెరికా పెత్తనానికి వ్యతిరేకించే వారందరి హృదయాల్ని గెలుచుకున్నాడు. అటువంటి చావెజ్ క్యాన్సర్‌ని జయించలేక కన్నుమూశారు. అభిమాన నేత మరణాన్ని వెనిజులావాసులు శోకసముద్రంలో మునిగిపోయారు.

                 వెనిజుల్లా అధ్యక్షుడు హూగో చావెజ్ మృతికి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాపం తెలిపారు. వెనిజుల్లా గొప్ప నేతను కోల్పోయిందని ప్రధాని అన్నారు .చావెజ్ అత్యంత జనాకర్షణ కలిగిన ఉన్న నేత అని ప్రధాని సంతాప ప్రకటనలో తెలిపారు. వామపక్ష సిద్దాంతాలతో సామాజిక న్యాయం జరిగేలా పోరాటం చేసిన నాయకుడు అని అన్నారు.