Tuesday, February 28, 2012

భారత్ సంచలన విజయం...


36.4 ఓవర్లలో 321 లక్ష్యాన్ని ఛేదించిన ఇండియా
లంకపై 7 వికెట్ల తేడాతో గెలుపు

     ముక్కోణపు సిరీస్ వన్డేలో భారత్-శ్రీలంక మధ్య మంగళవారం  జరిగిన మ్యాచ్‌లో ఇండియా 36.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఈ టూర్‌లో ఇండియా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఈరోజు లంకపై విజయం సాధించి, ఫైనల్‌కు ఆశలు సజీవంగా ఉంచుకోవడంతో అందరిలోనూ సంతోషం వెల్లివిరిసింది. భారత్ 36.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. విరాట్ కోహ్లీ 88 బంతులలో 133 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, గౌతమ్ గంభీర్ 63, సచిన్ : 39, సెహ్వాగ్ : 30 పరుగులు చేశారు. కాగా టీంఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

         అంతకు ముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసి 321 పరుగుల విజయలక్ష్యాన్ని ఇండియా ముందుంచింది. మ్యాచ్ ప్రారంభం నుంచి నిలకడగా ఆడిన శ్రీలంక భారీ స్కోర్ చేసింది. దిల్షాన్ సంగక్కర పరుగుల వర్షం కురిపించి ఇండియా బౌలర్లకు చెమటలు పట్టించారు. జయవర్ధనే : 22, దిల్షాన్ (నాటౌట్) : 160, సంగక్కర : 105, పెర్రారా : 3, మేథౌస్ : 14, ఛండిమల్ (నాటౌట్) : 2

         విమర్శకుల మాటలకు తన అద్భుత బ్యాటింగ్‌తో భారత జట్టు సమాధానం చెప్పింది. ఫైనల్‌కు చేరాలంటే బోనస్ పాయింట్‌తో గెలవాల్సిన తరుణంలో శ్రీలంకతో జరిగిన కీలక వన్డేలో భారత్ అద్భుత ఆటతీరు ప్రదర్శించి ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు బ్యాట్స్‌మెన్ ఏ దశలోనూ వెనక్కి చూడకుండా ఆకాశమే హద్దుగా చెలరేగారు. భారత జట్టు బోనస్ పాయింట్‌తో సహా 15 పాయింట్లు పొంది ఫైనల్ ఆశలు సజీవంగా నిలుపుకుంది.

భారత్ సంచలన విజయం...


36.4 ఓవర్లలో 321 లక్ష్యాన్ని ఛేదించిన ఇండియా
లంకపై 7 వికెట్ల తేడాతో గెలుపు

     ముక్కోణపు సిరీస్ వన్డేలో భారత్-శ్రీలంక మధ్య మంగళవారం  జరిగిన మ్యాచ్‌లో ఇండియా 36.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఈ టూర్‌లో ఇండియా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఈరోజు లంకపై విజయం సాధించి, ఫైనల్‌కు ఆశలు సజీవంగా ఉంచుకోవడంతో అందరిలోనూ సంతోషం వెల్లివిరిసింది. భారత్ 36.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. విరాట్ కోహ్లీ 88 బంతులలో 133 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, గౌతమ్ గంభీర్ 63, సచిన్ : 39, సెహ్వాగ్ : 30 పరుగులు చేశారు. కాగా టీంఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

         అంతకు ముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసి 321 పరుగుల విజయలక్ష్యాన్ని ఇండియా ముందుంచింది. మ్యాచ్ ప్రారంభం నుంచి నిలకడగా ఆడిన శ్రీలంక భారీ స్కోర్ చేసింది. దిల్షాన్ సంగక్కర పరుగుల వర్షం కురిపించి ఇండియా బౌలర్లకు చెమటలు పట్టించారు. జయవర్ధనే : 22, దిల్షాన్ (నాటౌట్) : 160, సంగక్కర : 105, పెర్రారా : 3, మేథౌస్ : 14, ఛండిమల్ (నాటౌట్) : 2

         విమర్శకుల మాటలకు తన అద్భుత బ్యాటింగ్‌తో భారత జట్టు సమాధానం చెప్పింది. ఫైనల్‌కు చేరాలంటే బోనస్ పాయింట్‌తో గెలవాల్సిన తరుణంలో శ్రీలంకతో జరిగిన కీలక వన్డేలో భారత్ అద్భుత ఆటతీరు ప్రదర్శించి ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు బ్యాట్స్‌మెన్ ఏ దశలోనూ వెనక్కి చూడకుండా ఆకాశమే హద్దుగా చెలరేగారు. భారత జట్టు బోనస్ పాయింట్‌తో సహా 15 పాయింట్లు పొంది ఫైనల్ ఆశలు సజీవంగా నిలుపుకుంది.

జాతీయ విజ్ఞాన దినోత్సవ శుభాకాంక్షలు ....

              చంద్రశేఖర్‌ వెంకట రామన్‌ (సి.వి.రామన్‌) ఎఫెక్టును కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవం జపుతారు. ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి, రువైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్‌ బహుమతి విజేతగా నిలిచారు. కేంద్రప్రభుత్వం భారతరత్న బహుకరించింది.


      మానవ సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసిన వాటిలో శాస్త్ర సాంకేతిక రంగాలది ప్రథమస్థానం. సామాజిక జీవన ప్రమాణాల్ని, ఆర్థిక సంబంధాల్ని, సాంస్కృతిక నియమాల్నే గాక ప్రకృతి, భౌతిక ప్రపంచం గురించిన తాత్విక పరిజ్ఞానానికి శాస్త్రీయ పునాదిని కూడా శాస్త్ర సాంకేతిక రంగాలే సమకూర్చాయి.

             స్వేచ్ఛ, స్వాతంత్య్రం, స్వయంపాలన, స్వయంప్రతిపత్తి వంటి వాదనలు బలపడుతున్న స్థితిలో ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న ఆయుధ సంపత్తితో, పెద్దయెత్తున వినాశకర అణ్వాయుధాల తయారీకి, ఆధునిక రహస్య గూఢచర్యం కోసం వాడుతూ ఈ శక్తులు సౖన్సును దుర్వినియోగం చేస్తున్నాయి. ఈ శాస్త్రసాంకేతిక సంపత్తిని గుప్పెట్లో పెట్టుకున్నాయి. సోషలిస్టు ఉత్పత్తి పద్ధతుల్ని దెబ్బతీసేందుకు ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ అనే త్రిముఖ వ్యూహంతో ప్రపంచదేశాల్ని శాసించాలని, ప్రపంచ క్రమాన్ని, పాలనా పద్ధతుల్ని ప్రభావితం చేయాలని చూస్తున్నాయి.

                 విప్లవాత్మకమైన రీతిలో ఖగోళ పరిజ్ఞానం, జీవశాస్త్ర పరిజ్ఞానం, కంప్యూటర్‌ రంగం, పాదార్థిక విజ్ఞానం అభివృద్ధి చెందిన సమయం కూడా అదే! అభివృద్ధి చెందిన శాస్త్ర సాంకేతిక రంగాలకున్న సహజ ప్రవృత్తి ప్రజల్ని మేల్కొలపడం, వారిలో ఆధునిక చైతన్యాన్ని తీసుకురావడం. మానవ చరిత్రలో శాస్త్ర సాంకేతిక రంగాలు ప్రగతిశీల పాత్రను పోషించాయి. కానీ ప్రజల్ని అంధకారంలో ఉంచి పబ్బం గడుపుకొనే శక్తులకిది సమ్మతం కాదు.  పరమత ద్వేషం, అశాస్త్రీయత, మూఢనమ్మకాలు, స్వోత్కర్ష, కుహనా శాస్త్రమనే పునాదుల మీదే మతశక్తులు మనగగలవు.

           ప్రజల దైనందిన అవసరాల ప్రాముఖ్యత కన్నా విలాస వస్తువుల తయారీ, వినియోగతత్వాన్ని పోషించే ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ ప్రధాన రంగాలయ్యాయి. వ్యవసాయం, గృహ నిర్మాణం, రహదారుల నిర్మాణంలో కూడా ఆటోమేషన్‌ రావడంతో ప్రకృతి వనరులు హరించుకుపోతున్నాయి. జీవ సమతుల్యం, వనరుల సమతుల్యం దెబ్బతినడంతో పాటు, పర్యావరణ కాలుష్యం ఒక్కసారిగా పెరిగిపోయింది. నూతన ఆర్థిక పారిశ్రామికీకరణ పద్ధతులు అమల్లోకి వచ్చాక ఆబగా ప్రకృతి వనరుల్ని కొల్లగొట్టడంతో పాటు శత్రు వినాశనానికి వీలు కల్పించే రసాయనిక, క్రిమి ఆయుధాల తయారీ పరాకాష్టకు చేరుకుంది. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన, ఎయిడ్స్‌ వ్యాధి వంటివి యుద్ధోన్మాదుల ప్రాయోజిత ప్రయోగాల ఫలితాలేనని ఎన్నో పరిశోధనలు రుజువు చేశాయి.

            అటువంటి సంధి దశలో ప్రజలపక్షాన నిలిచే అభ్యుదయశక్తులు, ప్రభుత్వేతర సంస్థలు ఐక్యమై బలమైన ప్రజాసైన్సు ఉద్యమాన్ని చేపట్టవలసిన చారిత్రిక అవసరమేర్పడింది. ప్రజల్లో అశాస్త్రీయపుటంధకారం నుంచి వైజ్ఞానిక వెలుగువైపు నడిపించేందుకు, శాస్త్ర సాంకేతిక రంగాల్ని ప్రజాబాహుళ్యపు సమిష్టి ప్రయోజనాలకు సాధనాలుగా మార్చే ప్రక్రియకు బలాన్ని జోడించేందుకు ప్రజాసైన్స్‌ ఉద్యమ అవసరం ఏర్పడింది. ఆ స్ఫూర్తితో 1988 ఫిబ్రవరి 28న పురుడుపోసుకున్న 'జనవిజ్ఞాన వేదిక' కూడా తన 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టి, రజతోత్సవం జరుపుకుంటున్నది.

Tuesday, February 21, 2012

దేశభాషలందు తెలుగు లెస్స...

                           అందరికి మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో...

భాషలన్నింటిలో మాతృభాషకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.శిశువు మొట్టమొదట నేర్చుకునే భాషే తల్లిబాష. శిశువు సహజరీతిలో నేర్చుకొనే భాష 'మాతృభాష'. ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతీయ భాష మాతృభాష అవుతుంది. శ్రీకృష్ణదేవరాయలు మన తెలుగును దేశభాషలందు తెలుగు లెస్స అని కొనియాడారు.


              భారత రాజ్యాంగంలోని 345 అధికరణం ప్రకారం ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి రాష్ట్రాలకు అధికారమిచ్చింది. 1966లో ఆంధ్రప్రదేశ్‌ శాసనవిభాగం అధికార భాషా శాసనాన్ని తయారు చేసింది. త్రిభాషా సూత్రాన్ని కూడా ప్రతిపాదించారు. మాతృభాష తెలుగును ప్రథమ, జాతీయ బాష హిందిని ద్వితీయ, ఆంగ్లబాషను తృతీయ భాషలుగా ప్రతిపాదించారు.
రాష్ట్ర ప్రభుత్వం 1969లో ఇంటర్మీడియట్‌ తరగతులకు తెలుగును బోధ భాషగా ప్రవేశపెట్టింది. 1971లో డిగ్రీ కళాశాల జరగాలని నిర్ణయించారు.

నేడు  అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా. (ఫిబ్రవరి 21)

Wednesday, February 15, 2012

పేదలకు నీటి చుక్క లేన్నట్లెనా...?

                  తిండి దొరక్కపోతే కనీసం నీళ్లు తాగి బతికే పేదలకు ఇక అవి కూడా ఉచితంగా దొరకని దౌర్భాగ్య పరిస్థితులు దాపురించాయి. దేశంలో కలుషిత నీటిని తాగడం వల్ల జరిగే మరణాలే ఎక్కువ. ఇలాంటి అనుభవాలు ముందుండగానే కేంద్రం కొత్త జల విధానంలో  ప్రజలపై, రైతులపై భారాలు మోపడానికి ఎలాంటి జంకు లేకుండా సిద్ధమైందని అర్థమవుతుంది. నగరాలు, పట్టణాల్లో విషమ షరతులు విధించి పన్నులతో ప్రజల నడ్డి విరగ్గొడుతున్నారు.

                   మనిషికి ప్రాణాధారమైన నీటిని ప్రైవేటీకరించి వ్యాపార సరుకుగా మార్చడం నుండి మరెన్నో వినాశకర అంశాలు కొత్త జల విధాన ముసాయిదాలో చోటు చేసుకున్నాయని,  నీటి పంపిణీ సేవల ప్రైవేటీకరణ జల విధానంలో ప్రధానాంశమని వార్తలొస్తున్నాయి. అదే నిజమైతే అంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండబోదు. నీటిని ప్రైవేటీకరిస్తే చుక్క చుక్కను లెక్కగట్టి ధరలు నిర్ణయించి రైతులు, ఇతర వినియోగదారుల నుండి ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు. అంతే కాదు నిర్వహణ, పాలనా పరమైన ఖర్చుల మొత్తాన్నీ నీటిని వాడుకునే వారి నుండి ఎలాంటి రాయితీలు ఇవ్వకుండా రాబడతారు.


          ఒక్క మాటలో చెప్పాలంటే నీటి పంపణీ బాధ్యత నుండి ప్రభుత్వం వైదొలుగుతుంది. ప్రకృతి ప్రసాదించిన నీటిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు అందించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకపోగా మొత్తంగా ఆ రంగం నుండి వైదొలగడం గర్హనీయం.
 

Saturday, February 11, 2012

ప్రజావ్యతిరేక విధానాలు, అవినీతిపై వామపక్షాలే పోరాడుతున్నాయి - ప్రకాశ్‌ కరత్‌

  • సిపిఎం కేరళ రాష్ట్ర మహాసభల ముగింపు సభలో కరత్‌
  • తిరువనంతపురంలో రెడ్‌ షర్ట్‌ వాలంటీర్ల భారీ కవాతు
  • కార్యదర్శిగా పినరయి తిరిగి ఎన్నిక
             సిపిఎం కేరళ రాష్ట్ర మహాసభల ముగింపు ఈ సందర్భంగా సభకు ముఖ్య అతిధిగా హాజరైన పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ మాట్లాడుతూ... దేశంలో ప్రజావ్యతిరేక విధానాలు, అవినీతిపై పోరాడుతోంది వామపక్షాలు మాత్రమేనని చెప్పారు. ప్రజలు కూడా ఈ విషయాన్ని గుర్తించారన్నారు. లౌకిక, ప్రజాతంత్ర శక్తులతో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసేందుకు సిపిఎం చొరవ తీసుకుంటుందని చెప్పారు. మూడేళ్ల యుపిఎ-2 పాలనలో ధరల పెరుగుదల, నిరుద్యోగిత తీవ్రమైందని విమర్శించారు. ప్రజావ్యతిరేక నయా ఉదారవాద విధానాల వల్ల వేలాది మంది అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క జనవరిలోనే 160 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. కేరళలో రైతుల ఆత్మహత్యలు తిరిగి ప్రారంభమయ్యాయని, ఊమెన్‌చాందీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 31 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారని అన్నారు. 34 ఏళ్ల వామపక్ష ప్రభుత్వంలో బెంగాల్‌లో ఎన్నడూ వినని రైతు ఆత్మహత్యలు ఇప్పుడు వినిపిస్తున్నాయని, మమతా బెనర్జీ అధికారం చేపట్టాక ముడు పదులకు పైగా అన్నదాతలు బలయ్యారని అన్నారు. అనంతరం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కరత్‌, కొడియేరి బాలకృష్ణన్‌, పినరయి విజయన్‌, సిపిఎం శాసన సభాపక్ష నేత విఎస్‌ అచ్యుతానందన్‌, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి కడకంపల్లి సురేంద్రన్‌ ప్రసంగించారు.
                      సిపిఐ(ఎం) కేరళ రాష్ట్ర 20వ మహాసభలు శుక్రవారం తిరువనంతపురంలో జరిగిన భారీ బహిరంగ సభతో ముగిశాయి. ముగింపు సందర్భంగా అశేష జనవాహినితో నిర్వహించిన భారీ ర్యాలీతో రాజధాని నగరం తిరువనంతపురం ఎర్ర సముద్రాన్ని తలపించింది. దాదాపుగా 3 లక్షల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నగరంలోని ఐదు ప్రధాన రోడ్ల గుండా సాగిన ఈ ర్యాలీలో 25 వేల మంది రెడ్‌షర్ట్‌ వాలంటీర్ల కవాతు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆద్యంతం అత్యంత క్రమశిక్షణతో సాగి, కమ్యూనిస్టు ఉద్యమ బలాన్ని చాటిన ఈ ర్యాలీలు ఇ బాలానందన్‌ నగర్‌ (చంద్రశేఖరన్‌ నాయర్‌ స్టేడియం)లో కలిశాయి. రైతులు, వివిధ రంగాల కార్మికులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువజనులు, విద్యార్థులు, ఉద్యోగులు ర్యాలీకి పెద్ద ఎత్తున తరలివచ్చారు.
( ప్రజాశక్తి సౌజన్యంతో..... ) 

Wednesday, February 8, 2012

భారత్ విజయం ..

   ముక్కోణపు సిరీస్‌లో భాగంగా భారత్-శ్రీలంక మధ్య ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్‌లో (పెర్త్, ) బుధవారం జరుగుతున్న ఒన్డేలో లంకపై భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 44.6 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఈసారి కూడా  సచిన్ టెండూల్కర్ సెంచరీ చేస్తారన్న అభిమానులకు నిరాసే మిగిల్చారు. 48 పరుగుల వద్ద ఔట్ అయ్యారు. విరాట్ కోహ్లీ 77 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు.  కోహ్లీ : 77,  సచిన్ : 48, ఆశ్విన్ (నాటౌట్) : 30,   రైనా : 24, జడేజా (నాటౌట్) : 24,  సెహ్వాగ్ - 10, శర్మ : 10, కెప్టెన్ ధోనీ : 4, 

                      టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసి, 234 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. శ్రీలంక ఆటగాళ్లలో చండీమాల్ ఒక్కరే ఆఫ్‌సెంచరీ చేశారు. భారత్ బౌలర్లలో అశ్విన్ 3, జహీర్ ఖాన్ 2 వికెట్లను తీసుకున్నారు.
     తరంగ : 4, దిల్‌షా : 48, సంగక్కర : 26, చండిమాల్ : 64, జయవర్ధనే : 23, పెరెరా : 7, బాథేవ్స్ : 33,
                     ఇప్పటికే   ఒటమిలతో భారత్  నడుస్తూన్నది.    
  ఒన్డేల 
సిరీస్‌లో ఐన భారత్  ఘనవిజయం సాధించాలని  కొరుకుందాం.   

Friday, February 3, 2012

కాజేసింది కక్కించాలి - ప్రకాశ్‌ కరత్‌

  • 2జిపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం
  • రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానం
  • బెంగాల్‌దీ అదే దారి
  • వామపక్ష ప్రజాతంత్రమే ప్రత్యామ్నాయం
  • సిపిఎం రాష్ట్ర మహాసభ ప్రారంభ సభలో ప్రకాశ్‌ కరత్‌
             కార్పొరేట్‌ అవినీతికారణంగా దేశం నఫ్టపోయిన మొత్తాన్ని ఆ సంస్థల నుండి వసూలు చేయాలని సిపిఎం ప్రధానకార్యదర్శి ప్రకాశ్‌కరత్‌ డిమాండ్‌ చేశారు.  ఖమ్మంలో సిపిఎం 23వ రాష్ట్ర మహాసభలను ప్రకాష్‌ కరత్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడ్డ కార్పొరేట్‌ సంస్థలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. 2జి కుంభకోణంలో అక్రమాలకు పాల్పడ్డ కార్పొరేట్‌ సంస్థల లైసెన్స్‌లు రద్దు చేయాలంటూ ఇచ్చిన తీర్పును చారిత్రాత్మకమైనదిగా ఆయన అభివర్ణించారు. వాస్తవానికి సిపిఎం మొదటి నుండి డిమాండ్‌ చేస్తోందని చెప్పారు. 2జి స్పెక్ట్రమ్‌ కంభకోణంలో122 సంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయని వాటి లైసెన్స్‌లు రద్దు చేయాలని తాము కోరినట్లుచెప్పారు. ట్రారుకూడా73 సంస్థల లైసెన్స్‌లు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించిందని తెలిపారు. అయితే, కేంద్ర మంత్రి కపిల్‌ సిబాల్‌ ఈ సూచనను తిరస్కరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. లైసెన్స్‌లు రద్దు చేస్తే కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వంపై నమ్మకం పోతుందని, పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావని వాదించారని తెలిపారు. ఈ తరహా అవినీతిని దృష్టిలో ఉంచుకునే లోక్‌పాల్‌ పరిధిలోకి కార్పొరేట్‌ సంస్థలను తీసుకురావాలని తాము డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం రూపొందించిన లోక్‌పాల్‌ బిల్లు వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని ఆయన అన్నారు. లోక్‌పాల్‌ తోనే అవినీతిమొత్తం అంతమౌతుందన్న అభిప్రాయం కూడా సరికాదని చెప్పారు.