షహీద్ భగత్సింగ్ పేరే యువతకు ఉత్తేజం.
ఆయన స్ఫూర్తి.
పోరాట సంప్రదాయాలకో సంకేతం.
త్యాగం ఆదర్శానికి నిదర్శనం.
ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్థిల్లాలిః, తెల్లదొరతనం పోవాలి, అన్నందుకు ప్రాణాలు కోల్పోయాడు. కోట్లాది భారతీయుల హృదయాల్లో ఆరని జ్యోతిగా చిరస్థాయిగా నిలిచిపోతాడని ఎవరు ఊహింలేదు.
నాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి అతి చిన్న వయస్సులో ఉరికంబాన్ని చిరునవ్వుతో ముద్దాడిన యువ కిశోరాన్ని స్మరించుకోవాల్సిన అవసరముంది. చిల్లర వర్తకంలోకి ఎఫ్డిఐలను అనుమతించడం, దేశంలో విద్య వ్యాపారీకరణకు విదేశీ వర్శిటీలను స్వాగతించడం చూస్తుంటే... కేంద్ర, రాష్ట్ర పాలకులు సామ్రాజ్యవాదులకు దాసోహమైనట్లు తేటతెల్లమవుతోంది. కావున విద్యార్థులు, యువకులు భగత్సింగ్ను స్మరించుకుంటూ సామ్రాజ్యవాద, నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామని నేడు భగత్సింగ్ 105వ జయంతి సందర్బంగా ప్రతిజ్ఞ పూనాలని విజ్ఞప్తి.
No comments:
Post a Comment