Monday, April 2, 2012

సీపీఐ జాతీయ సారథ్య బాధ్యతలను చేపట్టిన తెలుగువారు


  సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. పాట్నాలో జరిగిన సీపీఐ (భారత కమ్యూనిస్టు పార్టీ)21వ జాతీయ మహాసభల్లో బర్థన్ స్థానంలో ఆయన్ని పార్టీ ప్రతినిధులు ఎన్నుకున్నారు. జాతీయ రాజకీయ చిత్రంపై మరోసారి ఓ తెలుగువారిని ఉన్నతమైన పదవి వరించింది. 24ఏళ్ళ తర్వాత సీపీఐ సారథ్య బాధ్యతలను చేపట్టిన తెలుగువారిగా సురవరం చరిత్ర సృష్టించారు.

    సుదీర్ఘ కమ్యూనిస్టు ఉద్యమ నేపథ్యం కలిగిన సురవరం మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందినవారు.  సమరశీల రాజకీయ కార్యకర్త, మేధావి, మంచి వక్త.  2008 మార్చి నుండి పార్టీ ఉపప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అప్పటికి ఆయన భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమితి కార్యదర్శిగా, జాతీయ సమితి కార్య వర్గ సభ్యులుగా వున్నారు.
            సురవరం నల్గొండ నుంచి 1998లో తిరిగి 2004 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికై ప్రతిభావంతుడైన పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు.


No comments:

Post a Comment