ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో సచిన్ సెంచరీ మిస్ చేశారు. వందో శతకానికి ఆరు పరుగుల దూరంలో సచిన్ ఔట్ అయ్యారు. సెంచరీ మిస్ చేసుకోవడం సచిన్కిది 16 వ సారి.
ఇంకా ఈ టెస్టులో భారత్కు మళ్ళీ ఇన్నింగ్స్ రావడం, మరల సచిన్ సెంచరీ చేయడం చాల కష్టమే. వచ్చే నెలలో జరుగనున్న మూడు వన్డేలకు సచిన్ కు విశ్రాంతి ఇచ్చారు. కాబట్టి ఈ మధ్యకాలంలో సెంచరీల '' సెంచరీ '' లేదు.
వెస్టిండీస్తో జరుగు మూడు ఒన్డేలకు భారత్ జట్టును బీసీసీఐ శుక్రవారం ఎంపిక చేసింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోనీకి విశ్రాంతి ఇస్తూ, కెప్టెన్గా వీరేంద్రసెహ్వాగ్ను ఎంపిక చేస్తూ చేసింది.
వీరేంద్రసెహ్వాగ్ ( కెప్టెన్ ), గౌతమ్ గంభీర్, కోహ్లీ, పటేల్, మనోజ్ తివారీ, రైనా, ఉమేష్ యాదవ్, రాహుల్ శర్మ, ప్రవీణ్ కుమార్, జడేజా, రహానే, వరుణ్, రోహిత్శర్మ, వినయ్కుమార్ తదితరులను బీసీసీఐ ఎంపిక చేసింది. కాగా ఈ వన్డేలకు యువరాజ్, హర్భజన్సింగ్ను దూరంగా ఉంచింది.
No comments:
Post a Comment