Friday, November 25, 2011

సచిన్‌ సెంచరీల '' సెంచరీ '' ఏపుడూ....?

                ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో సచిన్ సెంచరీ మిస్ చేశారు. వందో శతకానికి ఆరు పరుగుల దూరంలో సచిన్ ఔట్ అయ్యారు.  సెంచరీ మిస్ చేసుకోవడం సచిన్‌కిది 16 వ సారి. 
              ఇంకా ఈ టెస్టులో భారత్‌కు మళ్ళీ ఇన్నింగ్స్‌ రావడం, మరల సచిన్‌ సెంచరీ చేయడం చాల కష్టమే. వచ్చే నెలలో జరుగనున్న మూడు వన్డేలకు సచిన్‌ కు విశ్రాంతి ఇచ్చారు. కాబట్టి  ఈ మధ్యకాలంలో సెంచరీల '' సెంచరీ '' లేదు.
               వెస్టిండీస్‌తో జరుగు మూడు ఒన్డేలకు భారత్ జట్టును బీసీసీఐ శుక్రవారం ఎంపిక చేసింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోనీకి విశ్రాంతి ఇస్తూ, కెప్టెన్‌గా వీరేంద్రసెహ్వాగ్‌ను ఎంపిక చేస్తూ చేసింది.
               వీరేంద్రసెహ్వాగ్‌ ( కెప్టెన్‌ ), గౌతమ్ గంభీర్, కోహ్లీ, పటేల్, మనోజ్ తివారీ, రైనా, ఉమేష్ యాదవ్, రాహుల్ శర్మ, ప్రవీణ్ కుమార్, జడేజా, రహానే, వరుణ్, రోహిత్‌శర్మ, వినయ్‌కుమార్ తదితరులను బీసీసీఐ ఎంపిక చేసింది. కాగా ఈ వన్డేలకు యువరాజ్, హర్భజన్‌సింగ్‌ను దూరంగా ఉంచింది.


No comments:

Post a Comment