Tuesday, February 21, 2012

దేశభాషలందు తెలుగు లెస్స...

                           అందరికి మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో...

భాషలన్నింటిలో మాతృభాషకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.శిశువు మొట్టమొదట నేర్చుకునే భాషే తల్లిబాష. శిశువు సహజరీతిలో నేర్చుకొనే భాష 'మాతృభాష'. ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతీయ భాష మాతృభాష అవుతుంది. శ్రీకృష్ణదేవరాయలు మన తెలుగును దేశభాషలందు తెలుగు లెస్స అని కొనియాడారు.


              భారత రాజ్యాంగంలోని 345 అధికరణం ప్రకారం ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి రాష్ట్రాలకు అధికారమిచ్చింది. 1966లో ఆంధ్రప్రదేశ్‌ శాసనవిభాగం అధికార భాషా శాసనాన్ని తయారు చేసింది. త్రిభాషా సూత్రాన్ని కూడా ప్రతిపాదించారు. మాతృభాష తెలుగును ప్రథమ, జాతీయ బాష హిందిని ద్వితీయ, ఆంగ్లబాషను తృతీయ భాషలుగా ప్రతిపాదించారు.
రాష్ట్ర ప్రభుత్వం 1969లో ఇంటర్మీడియట్‌ తరగతులకు తెలుగును బోధ భాషగా ప్రవేశపెట్టింది. 1971లో డిగ్రీ కళాశాల జరగాలని నిర్ణయించారు.

నేడు  అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా. (ఫిబ్రవరి 21)

No comments:

Post a Comment