Showing posts with label క్రీడలు.... Show all posts
Showing posts with label క్రీడలు.... Show all posts

Saturday, August 4, 2012

హైదరాబాద్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు క్యాంస్యం




  ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో హైదరాబాద్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు క్యాంస్యం లభించింది. మూడో స్థానంకోసం జరిగిన పోటీలో చైనా క్రీడాకారిణి వాంగ్‌పై సైనా విజయం సాధించింది.

భాగ్యనగరానికి మరో కీర్తి...
  హైదరాబాద్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు శుభాకాంక్షలు.  మన క్రీడాకారులు మరిన్ని పతకాలు తేస్తారని అశిస్తూ...

Tuesday, July 31, 2012

భాగ్యనగరానికి మరో కీర్తి...


భాగ్యనగరానికి మరో కీర్తి...
లండన్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ బోణీ చేసినా హైదరాబాదీ షూటర్‌ గగన్‌ నారంగ్‌ కు శుభాకాంక్షలు.  మన క్రీడాకారులు మరిన్ని పతకాలు తేస్తారని అశిస్తూ...


( ఈనాడు సౌజన్యంతో..... )

Friday, March 16, 2012

సెంచరీల " సెంచరీ వీరుడు" ...


                    ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన సెంచరీల సెంచరీ వీరుడు (100 సెంచరీలు) సాధించిన బ్యాట్స్ మెన్. 
                     ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు సచిన్  టెండుల్కర్. క్రికెట్ క్రీడకు భారతదేశం లో అత్యధిక జనాదరణకు కారకుడై, చిన్న పిల్లలు మొదలు ముసలివాళ్ళ మనసులను సైతం దోచుకున్న వర్తమాన క్రికెటర్ టెండుల్కర్. భారత క్రికెట్ లో మెరుపులు మెరిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆటగాడు సచిన్. భారత జట్టుకు ఆపద్భాందవుడిగా ఎన్నో విజయాలు అందజేసిన ఈ ముంబాయి కి చెందిన బ్యాట్స్‌మెన్ ను పొగడని వారు లేరనే చెప్పవచ్చు. లెక్కకు మించిన రికార్డులు అతని సొంతం. టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగులలో మొదటి స్థానం సంపాదించాడు. వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగుల రికార్డు అతనిదే. ఇక సెంచరీల విషయంలో అతనికి దరిదాపుల్లో ఎవరూ లేకపోవడం గమనార్హం. లిటిల్ మాస్టర్ లేదా మాస్టర్ బ్లాస్టర్.  1997-1998లో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పొంది ఈ అవార్డు స్వీకరించిన ఏకైక క్రికెట్ క్రీడాకారుడిగా నిల్చినాడు. ఇప్పటి వరకు క్రికెట్ క్రీడా జగత్తులోని అత్యంత ప్రముఖమైన క్రీడాకారులలో ఒకరు సచిన్ టెండుల్కర్.

వన్డే రికార్డులు
వన్డే క్రికెట్ లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (49 సెంచరీలు)
వన్డే క్రికెట్ లో అత్యధిక అర్థ సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (95 అర్థ సెంచరీలు)
అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్. (18412 పరుగులు) 
అత్యధిక వన్డే పోటీలకు ఆడిన క్రికెటర్. (462 వన్డేలు)
వన్డే క్రికెట్ లో అత్యధిక పర్యాయాలు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డు పొందిన క్రికెటర్. (62 సార్లు)
వన్డే క్రికెట్ లో అత్యధిక పర్యాయాలు మ్యాన్ ఆప్ ది సీరీస్ అవార్డు పొందిన క్రికెటర్. (14 సార్లు)


టెస్ట్ రికార్డులు
టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (51 సెంచరీలు)
టెస్ట్ క్రికెట్‌లోఅత్యధిక అర్థసెంచరీలు సాధించిన భారతీయ బ్యాట్స్ మెన్. (63అర్థ సెంచరీలు)
20 సంవత్సరాల వయస్సులోనే 5 టెస్ట్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్.
కెప్టెన్‌గా ఇన్నింగ్సులో అత్యధిక పరుగులు చేసిన భారతీయుడు. (217 పరుగులు)
అన్ని టెస్టు ఆడే దేశాలపై సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు

Saturday, March 10, 2012

మిస్టర్‌ డిపెండబుల్‌ క్రికెట్‌కు వీడ్కోలు ...


             మిస్టర్‌ డిపెండబుల్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. శుక్రవారం మీడియా సమావేశంలో ద్రవిడ్‌ ఈ విషయాన్ని ప్రకటించాడు. 1996లో అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టిన రాహుల్‌ ద్రవిడ్‌ 16 ఏళ్లపాటు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో ద్రవిడ్‌ భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టాడు. ది వాల్‌, మిస్టర్‌ డిపెండబుల్‌గా పేరొందిన ద్రవిడ్‌ భారత క్రికెట్‌కు అందించిన సేవలు వర్ణించలేనివి.
                   164 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ద్రవిడ్‌ 52.31 సగటుతో 13,288 పరుగులు సాధించాడు. ఇందులో 36 శతకాలు, 63 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో 210 క్యాచ్‌లను పట్టి అత్యధిక క్యాచ్‌లను పట్టిన క్రికెటర్‌గా తన పేరిట రికార్డును లిఖించుకున్నాడు. దీంతోపాటు 25 టెస్టుల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దీనిలో భారత్‌ 8 మ్యాచుల్లో విజయం సాధించగా, ఆరు మ్యాచుల్లో ఓటమి పాలైంది. మరో 11 మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి. వన్డేల్లో కూడా ద్రవిడ్‌ అద్భుతంగా రాణించాడు. మొత్తం 344 మ్యాచ్‌లు ఆడిన దివాల్‌ 39.16 సగటుతో 10,889 పరుగులు సాధించాడు. వీటిలో 12 శతకాలు, 83 అర్ధ సెంచరీలు ఉన్నాయి.  ద్రవిడ్‌ 196 క్యాచ్‌లను కూడా పట్టాడు. సమకాలిన క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఖ్యాతి గడించిన ద్రవిడ్‌ భారత్‌ క్రికెట్‌ అందించిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయి. ఉత్తమ టెక్నిక్‌తో భారత ఇన్నింగ్స్‌కు పెట్టని గోడగా నిలిచే ద్రావిడ్‌ను పెవిలియన్‌కు పంపడానికి ఉద్ధండ బౌలర్లు కూడా అష్టకష్టాలు పడాల్సి వచ్చేది.  క్లిష్ట సమయంలోనూ నిబ్బరంగా ఆడే సత్తా ఒక్క ద్రవిడ్‌కే ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. విదేశి గడ్డపై అద్భుత రికార్డు కలిగిన ద్రవిడ్‌ భారత్‌కు ఎన్నో చారిత్రక విజయాలు అందించాడు.కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో హైదరాబాదీ వివిఎస్. లక్ష్మణ్‌తో కలిసి నెలకొల్పిన రికార్డు భాగస్వామ్యం క్రికెట్‌ చరిత్రలోనే అత్యద్భుత ప్రదర్శనల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

           ప్రపంచ క్రికెట్‌లో ద్రవిడ్‌ అద్భుత ఆటగాడు. ఆటగాడిగా ద్రవిడ్‌ స్థానాన్ని భర్తీ చేయడం దాదాపు అసాధ్యము.  భారత్‌కు లభించిన ఆణిముత్యాల్లో ద్రవిడ్‌ ఒకడు. సుదీర్ఘ కెరీర్‌లో ద్రవిడ్‌ సాగించిన ప్రస్థానం, భారత జట్టుకు చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టిన ఘనత ద్రవిడ్‌కే దక్కుతుంది.

Tuesday, February 28, 2012

భారత్ సంచలన విజయం...


36.4 ఓవర్లలో 321 లక్ష్యాన్ని ఛేదించిన ఇండియా
లంకపై 7 వికెట్ల తేడాతో గెలుపు

     ముక్కోణపు సిరీస్ వన్డేలో భారత్-శ్రీలంక మధ్య మంగళవారం  జరిగిన మ్యాచ్‌లో ఇండియా 36.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఈ టూర్‌లో ఇండియా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఈరోజు లంకపై విజయం సాధించి, ఫైనల్‌కు ఆశలు సజీవంగా ఉంచుకోవడంతో అందరిలోనూ సంతోషం వెల్లివిరిసింది. భారత్ 36.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. విరాట్ కోహ్లీ 88 బంతులలో 133 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, గౌతమ్ గంభీర్ 63, సచిన్ : 39, సెహ్వాగ్ : 30 పరుగులు చేశారు. కాగా టీంఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

         అంతకు ముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసి 321 పరుగుల విజయలక్ష్యాన్ని ఇండియా ముందుంచింది. మ్యాచ్ ప్రారంభం నుంచి నిలకడగా ఆడిన శ్రీలంక భారీ స్కోర్ చేసింది. దిల్షాన్ సంగక్కర పరుగుల వర్షం కురిపించి ఇండియా బౌలర్లకు చెమటలు పట్టించారు. జయవర్ధనే : 22, దిల్షాన్ (నాటౌట్) : 160, సంగక్కర : 105, పెర్రారా : 3, మేథౌస్ : 14, ఛండిమల్ (నాటౌట్) : 2

         విమర్శకుల మాటలకు తన అద్భుత బ్యాటింగ్‌తో భారత జట్టు సమాధానం చెప్పింది. ఫైనల్‌కు చేరాలంటే బోనస్ పాయింట్‌తో గెలవాల్సిన తరుణంలో శ్రీలంకతో జరిగిన కీలక వన్డేలో భారత్ అద్భుత ఆటతీరు ప్రదర్శించి ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు బ్యాట్స్‌మెన్ ఏ దశలోనూ వెనక్కి చూడకుండా ఆకాశమే హద్దుగా చెలరేగారు. భారత జట్టు బోనస్ పాయింట్‌తో సహా 15 పాయింట్లు పొంది ఫైనల్ ఆశలు సజీవంగా నిలుపుకుంది.

భారత్ సంచలన విజయం...


36.4 ఓవర్లలో 321 లక్ష్యాన్ని ఛేదించిన ఇండియా
లంకపై 7 వికెట్ల తేడాతో గెలుపు

     ముక్కోణపు సిరీస్ వన్డేలో భారత్-శ్రీలంక మధ్య మంగళవారం  జరిగిన మ్యాచ్‌లో ఇండియా 36.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఈ టూర్‌లో ఇండియా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఈరోజు లంకపై విజయం సాధించి, ఫైనల్‌కు ఆశలు సజీవంగా ఉంచుకోవడంతో అందరిలోనూ సంతోషం వెల్లివిరిసింది. భారత్ 36.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. విరాట్ కోహ్లీ 88 బంతులలో 133 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, గౌతమ్ గంభీర్ 63, సచిన్ : 39, సెహ్వాగ్ : 30 పరుగులు చేశారు. కాగా టీంఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

         అంతకు ముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసి 321 పరుగుల విజయలక్ష్యాన్ని ఇండియా ముందుంచింది. మ్యాచ్ ప్రారంభం నుంచి నిలకడగా ఆడిన శ్రీలంక భారీ స్కోర్ చేసింది. దిల్షాన్ సంగక్కర పరుగుల వర్షం కురిపించి ఇండియా బౌలర్లకు చెమటలు పట్టించారు. జయవర్ధనే : 22, దిల్షాన్ (నాటౌట్) : 160, సంగక్కర : 105, పెర్రారా : 3, మేథౌస్ : 14, ఛండిమల్ (నాటౌట్) : 2

         విమర్శకుల మాటలకు తన అద్భుత బ్యాటింగ్‌తో భారత జట్టు సమాధానం చెప్పింది. ఫైనల్‌కు చేరాలంటే బోనస్ పాయింట్‌తో గెలవాల్సిన తరుణంలో శ్రీలంకతో జరిగిన కీలక వన్డేలో భారత్ అద్భుత ఆటతీరు ప్రదర్శించి ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు బ్యాట్స్‌మెన్ ఏ దశలోనూ వెనక్కి చూడకుండా ఆకాశమే హద్దుగా చెలరేగారు. భారత జట్టు బోనస్ పాయింట్‌తో సహా 15 పాయింట్లు పొంది ఫైనల్ ఆశలు సజీవంగా నిలుపుకుంది.

Wednesday, February 8, 2012

భారత్ విజయం ..

   ముక్కోణపు సిరీస్‌లో భాగంగా భారత్-శ్రీలంక మధ్య ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్‌లో (పెర్త్, ) బుధవారం జరుగుతున్న ఒన్డేలో లంకపై భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 44.6 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఈసారి కూడా  సచిన్ టెండూల్కర్ సెంచరీ చేస్తారన్న అభిమానులకు నిరాసే మిగిల్చారు. 48 పరుగుల వద్ద ఔట్ అయ్యారు. విరాట్ కోహ్లీ 77 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు.  కోహ్లీ : 77,  సచిన్ : 48, ఆశ్విన్ (నాటౌట్) : 30,   రైనా : 24, జడేజా (నాటౌట్) : 24,  సెహ్వాగ్ - 10, శర్మ : 10, కెప్టెన్ ధోనీ : 4, 

                      టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసి, 234 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. శ్రీలంక ఆటగాళ్లలో చండీమాల్ ఒక్కరే ఆఫ్‌సెంచరీ చేశారు. భారత్ బౌలర్లలో అశ్విన్ 3, జహీర్ ఖాన్ 2 వికెట్లను తీసుకున్నారు.
     తరంగ : 4, దిల్‌షా : 48, సంగక్కర : 26, చండిమాల్ : 64, జయవర్ధనే : 23, పెరెరా : 7, బాథేవ్స్ : 33,
                     ఇప్పటికే   ఒటమిలతో భారత్  నడుస్తూన్నది.    
  ఒన్డేల 
సిరీస్‌లో ఐన భారత్  ఘనవిజయం సాధించాలని  కొరుకుందాం.   

Thursday, December 8, 2011

'' వీరు'' విజయవిహారం.....

7 సిక్స్‌, 25 ఫోర్స్‌ 219 పరుగులతో సెహ్వాగ్‌ డబుల్‌ సెంచరీ చేశారు.


వన్డేలలో ప్రపంచ రికార్డులను నేలకోల్పిన సెహ్వాగ్‌
వన్డేలలో భారత్‌ అత్యధిక స్కోరు 418.
200 స్కోరు దాటిన వారిలో భారత్‌లో సెహ్వాగ్‌ 219, సచిన్‌ 200
400 ల మైలురాయిని ఇప్పటి వరకు కేవలం 4 సార్లు మాత్రమే దాటిన భారత్‌.
కెప్టెన్‌గా డబుల్‌ సెంచరీ వన్డేలలో ప్రపంచ రికార్డులను నేలకోల్పిన సెహ్వాగ్‌
 
సెహ్వాగ్‌ దుకుడుకు పోకుండా, తన నిజస్వరూపం ప్రదర్శిస్తున్నారు.
మధ్యమద్యలో చిరునవ్వులతో...సెహ్వాగ్‌ కనపడుతూ, పరుగుల వరదను కురిపిస్తున్నారు. 
                  
                   భారత్‌ విజయం కాయం.

వన్డే సిరిస్‌ విజయం దిశలో భారత్‌......


వీరు విజయవిహారం.....5 సిక్స్‌, 16 ఫోర్స్‌ తో 160 పరుగులతో నడిపిస్తున్నారు.( నాటౌవుట్‌). రైనా 38 పరుగులతోఆడుతున్నారు.
176 పరుగుల వద్ద తొలివికేట్‌ కోల్పొయింది. గంబీర్‌ 67 పరుగుల వద్ద ఔటయ్యారు. సహ్వాగ్‌ సెంచరీ చేశారు. ఇది వన్డేలలో 15వ సెంచరీ. సహ్వాగ్‌ విజయ విహారం నేడు మరల కనబడుతున్నది. సెహ్వాగ్‌ తన నిజస్వరూపం ప్రదర్శిస్తున్నారు. భారత్‌ విజయం కాయం.
భారత్‌ 36 ఓవర్స్‌లో 276 పరుగులతో...ఆడుతున్నారు. వెస్టిండీస్‌తో ఇండోర్‌లో జరుగుతున్న నాలుగవ వన్డేలో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత జట్టు 2-1 తేడాతో ముందంజలో ఉంది.
భారత్‌ విజయాన్ని కోరుతూ...

Friday, November 25, 2011

సచిన్‌ సెంచరీల '' సెంచరీ '' ఏపుడూ....?

                ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో సచిన్ సెంచరీ మిస్ చేశారు. వందో శతకానికి ఆరు పరుగుల దూరంలో సచిన్ ఔట్ అయ్యారు.  సెంచరీ మిస్ చేసుకోవడం సచిన్‌కిది 16 వ సారి. 
              ఇంకా ఈ టెస్టులో భారత్‌కు మళ్ళీ ఇన్నింగ్స్‌ రావడం, మరల సచిన్‌ సెంచరీ చేయడం చాల కష్టమే. వచ్చే నెలలో జరుగనున్న మూడు వన్డేలకు సచిన్‌ కు విశ్రాంతి ఇచ్చారు. కాబట్టి  ఈ మధ్యకాలంలో సెంచరీల '' సెంచరీ '' లేదు.
               వెస్టిండీస్‌తో జరుగు మూడు ఒన్డేలకు భారత్ జట్టును బీసీసీఐ శుక్రవారం ఎంపిక చేసింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోనీకి విశ్రాంతి ఇస్తూ, కెప్టెన్‌గా వీరేంద్రసెహ్వాగ్‌ను ఎంపిక చేస్తూ చేసింది.
               వీరేంద్రసెహ్వాగ్‌ ( కెప్టెన్‌ ), గౌతమ్ గంభీర్, కోహ్లీ, పటేల్, మనోజ్ తివారీ, రైనా, ఉమేష్ యాదవ్, రాహుల్ శర్మ, ప్రవీణ్ కుమార్, జడేజా, రహానే, వరుణ్, రోహిత్‌శర్మ, వినయ్‌కుమార్ తదితరులను బీసీసీఐ ఎంపిక చేసింది. కాగా ఈ వన్డేలకు యువరాజ్, హర్భజన్‌సింగ్‌ను దూరంగా ఉంచింది.