Tuesday, May 28, 2013

తెలుగువారికి ప్రపంచవ్యాప్త గుర్తింపును సాధించిపెట్టాడు...

           
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా తెలుగువారి గుండెల్లో చోటు సంపాదించుకున్న వ్యక్తి నందమూరి తారకరామారావు. కొన్ని దశాబ్దాలపాటు సాగిన కృషి, పట్టుదల వల్ల ఆయన సాగించిన నట యాత్ర అనన్య సామాన్యమైంది. తెరపైన కథానాయకుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించి, నిజ జీవిత కథానాయకుడిగా తెలుగువారి ముంగిట నిలబడ్డాడు. తెలుగు సినిమాకు, తెలుగు భాషకు, తెలుగువారికి ప్రపంచవ్యాప్త గుర్తింపును సాధించిపెట్టాడు. ముఖ్యంగా తెలుగు సినిమాపై ఆయన చెదిరిపోని ముద్ర వేశారు. రాజకీయాల్లోకి వెళ్లిన దాదాపు పదేళ్ల తరువాత తిరిగి సినిమాల్లో నటించి విజయం సాధించిన ఘనత ఆయనదే.

     భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఎందరో మహా నటులున్నారు.వారందరూ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. కానీ ఏ నటుడు నటించనీ, చేయలేని పాత్రలు చేసిన ఏకైక నటుడు నందమూరి తారకరామారావు. వందేళ్ళ సినీ చరిత్రలో ఆయనదో చరిత్ర.

 మే 28 ఎన్‌టి.రామారావు పుట్టినరోజు.

Wednesday, May 1, 2013

ప్రతిధ్వనించిన రోజు ... mayday



'ప్రపంచ కార్మికులారా! ఏకం కండీ  అంటూ ప్రతిధ్వనించిన రోజు  
 శ్రామికులందరూ ఆనందంతో జరుపుకునే పండుగ రోజు  'మేడే'!


మేడే కార్మికవర్గానికి స్ఫూర్తినిచ్చేరోజు.
ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాడి చనిపోయిన అమరవీరులకు నివాళలు అర్పించేరోజు.
కార్మికవర్గం తమ పోరాటాలను సమీక్షించుకొని ముందడుగు వేసేరోజు.
తమను దోపిడీకి గురి చేసే పెట్టుబడిదారీ విధానం అంతం కోసం ప్రతిఙ్ఞ చేసే రోజు.

               ఇప్పటికి 127 ఏళ్ళ క్రితం మే 1వ తేదీన ప్రారంభమైన కార్మికోద్యమాన్ని అణచాలని పెట్టుబడిదారీవర్గం అనుకుంటే అది ప్రపంచ మంతా అల్లుకుంది. ఆ రణన్నినాదం దేశ దేశాలను చుట్టుముట్టింది. 1889లో ప్యారిస్‌లో జరిగిన రెండో అంతర్జా తీయ కార్మికసంఘం ప్రథమ మహా సభ ప్రతి మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరపాలని తీర్మా నించింది. ఎనిమిది గంటల పని దినం, ప్రజాస్వామ్యం, కార్మిక హక్కుల కోసం ఉద్యమించా లని నిర్ణయించింది. 1917కు కార్మికవర్గం సోవియట్‌లో రాజ్యాధికారానికి వచ్చిన తరువాత ప్రపంచమంతా 8 గంటల పనిదినాన్ని చట్ట బద్ధంగా అంగీకరించాల్సి వచ్చింది. ఇది కార్మికులు సాధించిన విజయం. చరిత్ర మర్చిపోని ఈ అధ్యాయాన్ని స్మరించి, ఆ స్ఫూర్తితో ముందుకు సాగడమే శ్రమ జీవుల కర్తవ్యం.

  అందరికీ 'మేడే' శుభాకాంక్షలు!

Thursday, April 11, 2013

సామాజికోద్యమ చైతన్య జ్వాల ...



               సామాజికోద్యమ చైతన్య జ్వాల జ్యోతిరావుబాఫూలే. నేడు మహాత్మ జ్యోతిరావు బాపూలే జయంతి. జయంతిని దేశ ప్రజలు ఏప్రెల్‌ 11న జరుపుకుంటారు. దేశంలో రాజ్యాధికారం హస్తగతం చేసుకుని పెత్తందారి విధానాలతో కులాలను విడగొట్టి బ్రాహ్మణ ఆదిపత్యాన్ని ప్రదర్శిస్తున్న అగ్రకులాలపై యుద్ధం ప్రకటించారు ఫూలే. కులమత ఆధిపత్యాలను చీల్చి చెండాడిని సామాజిక విప్తవయోధుడాయన. మహాత్మా జ్యోతిరావు బాఫూలే 1827 ఏప్రిల్‌ 11న మహారాష్ట్రలోని పూణేకు సమీపంలో ఉన్న 'సతారా'లో 'మాలి' అనే శూద్రకులంలో జన్మించారు. ఆయనకు 1840లో సావిత్రి బాపూలేతో బాల్య వివాహం జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్‌లో అగ్రకుల పెత్తందారీ తనాన్ని, బ్రాహ్మణ కులవ్యవస్థ నుంచి ప్రజలకు స్వేచ్చా, స్వాతంత్య్రాలను కల్పించలేని ఆపార్టీ ప్రవచించే జాతీయ వాదానికి అర్థం లేదని చెప్పారు. 1873లో 'గులాంగిరి' అనే గ్రంధాన్ని ప్రచురించి ప్రాచుర్యం పొందారు. బ్రాహ్మణులు సాగించిన అన్యాయాలను, అంటరాని తనాన్ని, వివక్ష రూపాలను, అణచివేతను గులాంగిరి గ్రంథంలో ఆయన సమగ్రంగా వివరించారు. నిచ్చేన మెట్ల సమాజంలో దళితులు ఎదుర్కొంటున్న క్లిస్ట సమస్యలను 'తృతీయరత్న ' నాటకంలో కళ్లకుగట్టినట్లు వివరించారు. కుల, మత ఆగడాలను తన రచనల ద్వారా ప్రచారం చేశారు. దళిత కౌలు రైతులు మౌలిక సమస్యలను అధిగమంచేందుకు , మెలుకువలు తెలిపేందుకు పూలే క్షేత్రస్థాయిలో దర్శించారు.
                 ఇల్లాలి చదువు -ఇంటికి వెలుగు అనే సామాజిక భావనను అనేనినాదంతో బాలికలకు ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఆయన భార్యకు విద్యను నేర్పి తొలి మహిళా ఉపాధ్యాయినిగా ఆమె స్థానాన్ని సుస్థిరం చేశారు. ''సత్యశోధక సమాజ్‌'' అనే సంస్థద్వారా ఆధిపత్య కులాల సాంస్కృతిక భావజాలానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ భావజాలాన్ని ప్రచారం చేశారు. ఆయన చేసిన చేవలను గుర్తించి ఆనాటి సమాజం ఆయనకు 1888లో 'మహాత్మా ' అని బిరుదు పొందారు. వృద్ధాప్యంలో చేతిలో చిల్లిగవ్వలేకుండా జీవించారు.
              1889లో అక్టోబర్‌లో అస్వస్థతకు గురయి అదే ఏడాది నవంబర్‌28న తుదిశ్వాస వదిలారు.

విజయం చెకూరాలని ఆశిస్తు...

             ఈ విజయనామ సంవత్సరము మీకు అన్ని విషయాలలొ  
                          విజయం చెకూరాలని ఆశిస్తు...